Begin typing your search above and press return to search.

`అహం బ్ర‌హ్మ‌స్మి` అతిథి పాత్రలో హీరో ఛేంజ్

By:  Tupaki Desk   |   3 Aug 2021 2:30 AM GMT
`అహం బ్ర‌హ్మ‌స్మి` అతిథి పాత్రలో హీరో ఛేంజ్
X
హీరో మంచు మ‌నోజ్ ఎం.ఎం.ఆర్ట్స్ బ్యాన‌ర్ ని స్థాపించి ఇందులో తొలిగా `అహం బ్ర‌హ్మ‌స్మి` అనే సినిమాని నిర్మిస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఏడాదిన్న‌ర‌ కాలంగా ఈ మూవీ షూటింగ్ పైనే మ‌నోజ్ దృష్టి సారించారు. క‌రోనా మ‌హ‌మ్మారీ వ‌ల్ల కొన్ని నెల‌ల పాటు వాయిదా ప‌డినా.. ఇటీవ‌ల చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేస్తున్నారు.

ఈ చిత్రంలో మెగా మేన‌ల్లుడు సాయి తేజ్ ఓ అతిథి పాత్ర‌లో న‌టిస్తార‌ని ఇంత‌కుముందు ప్ర‌చారమైంది. కానీ ఇప్పుడు పేరు మారింది. సాయి తేజ్ కాదు అల్ల‌రి న‌రేష్ ఆ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని.. పాత్ర‌ నిడివి స్వ‌ల్ప‌మే అయినా కానీ క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర అని కూడా చెబుతున్నారు. నిమిషం పాటు మెరుపులాంటి స‌న్నివేశంలో న‌రేష్‌ క‌నిపిస్తార‌ట‌. మ‌హేష్ న‌టించిన మ‌హ‌ర్షిలో న‌రేష్ పూర్తి స్థాయి పాత్ర‌లో క‌నిపించినా మ‌నోజ్ చిత్రంలో అతిథిలా మెరిసే పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌.

మ‌నోజ్ కి కంబ్యాక్ మూవీ ఇది. ఎం.ఎం.ఆర్ట్స్ లో న‌వ‌త‌రానికి అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హిస్తాన‌ని మ‌నోజ్ ఇంత‌కుముందు తెలిపారు. ఈ చిత్రంలో కొత్త‌వారికి అవ‌కాశ‌మిచ్చారు. ఈ మూవీ రిలీజ్ తేదీ గురించి మ‌నోజ్ కాంపౌండ్ వెల్ల‌డించాల్సి ఉంటుంది.

నాంది త‌ర్వాత అల్ల‌రి న‌రేష్ స్పీడ్..?

అల్ల‌రి న‌రేష్ ఇటీవ‌లే నాంది సినిమాతో బంప‌ర్ హిట్ కొట్టిన ఉత్సాహంలో ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. త‌దుప‌రి వ‌రుస‌గా ప‌లు క్రేజీ సినిమాల‌తో న‌టుడిగా కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు. అలాగే నిర్మాత‌గానూ న‌రేష్ సినిమాలు చేయ‌నున్నారు.

ఈవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ ని తిరిగి పాపుల‌ర్ చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. న‌రేష్ - ఆర్య‌న్ బ్ర‌ద‌ర్స్ స‌రికొత్త ప్ర‌ణాళిక‌ల‌తో బ‌రిలో దిగుతున్నార‌ని తెలిసింది. గ‌త‌ వైభ‌వాన్ని మ‌ళ్లీ నిల‌బెట్ట‌బెట్టాల‌న్న‌దే అన్న‌ద‌మ్ముల ప్లాన్. ఈ బ్యాన‌ర్ నుంచి త్వ‌ర‌లోనే రెండు సినిమాలు ఓ వెబ్ సిరీస్ తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. తెలుగులో ఓ ప‌క్కా కామెడీ వెబ్ సిరీస్ ని ఈ బ్యాన‌ర్ ద్వారా తీసుకురావ‌డానికి ప్లాన్ చేసార‌ని తెలిసింది.