Begin typing your search above and press return to search.
అంధగాడి పక్కనుండి.. మిష్టర్ కోసం..
By: Tupaki Desk | 3 April 2017 11:22 PM ISTమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ మూవీ రిలీజ్ కి రెడీ అయిపోయింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు చాలానే ఉండగా.. రీసెంట్ గా మిస్టర్ యూనిట్ ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. దర్శకుడు శ్రీను వైట్ల ప్రమోషన్ యాక్టివిటీస్ ప్రారంభించేశారు.
అయితే.. ఈ మూవీలో మరో హీరోయిన్ గా నటించిన బ్యూటీ హెబ్బా పటేల్. ఈ కుమారి ప్రస్తుతం ఇటలీలో ఉండిపోవడంతో.. మిస్టర్ ప్రచారానికి దూరమైపోయింది. రాజ్ తరుణ్ మూవీ అంధగాడు షూటింగ్ లో భాగంగా ఇటలీలో ఉన్న ఈ సుందరికి.. మిస్టర్ కు తన వంతు ప్రచారం చేసేయాలని ఫిక్స్ అయిపోయి.. అక్కడి నుంచే సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కానిచ్చేస్తోంది. అయితే.. ఇందుకు రాజ్ తరుణ్ సోషల్ నెట్వర్కింగ్ ను పేజ్ ను వాడుకోవడమే ఆశ్చర్యకరం. ఏప్రిల్ 13న వస్తున్న మిస్టర్ ను చూసి థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలని అంటోంది హెబ్బా.
అయితే.. ఈ నెల 7న జరగనున్న మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా ఈమె అటెండ్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే.. ఈమె ఇటలీ నుంచి ఇండియా తిరిగొచ్చేది ఈ నెల 13నే. అంటే సరిగ్గా సినిమా విడుదల తేదీకన్న మాట. రాజ్ తరుణ్ సినిమా షూటింగ్ లో ఉండి.. ఆ కుర్ర హీరో ట్విట్టర్ వాల్ లోనే మిస్టర్ ప్రమోషన్స్ చేస్తూ.. బాగానే టీజ్ చేస్తోంది హెబ్బా పటేల్. కుర్రాడు కూడా తక్కువేమీ కాదు.. అటు మిస్టర్ కు సపోర్ట్ చేస్తూనే.. తన స్టైల్ లో ట్వీట్స్ పెడుతూ అలరిస్తున్నాడు రాజ్ తరుణ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
