Begin typing your search above and press return to search.

రకుల్ ని తప్పించి కుమారిని తెచ్చారుగా

By:  Tupaki Desk   |   19 March 2016 7:31 AM GMT
రకుల్ ని తప్పించి కుమారిని తెచ్చారుగా
X
వరుణ్ తేజ్- శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కనున్న మూవీలో.. లీడ్ హీరోయిన్ కోసం వెతుకులాట ఓ కొలిక్కి వచ్చింది. ముందు ఈ మూవీలో కుర్ర భామ రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకుంటారని అనుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తో టెస్ట్ షూట్ కూడా చేశారు. దీంతో వీళ్లిద్దరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తారని అనుకుంటే.. ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఒకటి వచ్చింది.

వరుణ్ తేజ్- వైట్ల మూవీలో హేభా పటేల్ ను ఫైనల్ చేశారన్నది లేటెస్ట్ టాక్. కుమారి 21ఎఫ్ లో హేభా యాక్టింగ్ చూసిన మేకర్స్.. చివరకు ఆమెకే మొగ్గు చూపారని తెలుస్తోంది. రకుల్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్న మాట వాస్తవమే అయినా.. ఇప్పుడు మాత్రం పెర్ఫామెన్స్ పరంగా హేభా వైపే మొగ్గుచూపారని అంటున్నారు. అలా ఎలాతో మొదలై కుమారి 21ఎఫ్ తో హిట్ సాధించిన ఈ భామకు.. ఈ మెగా మూవీ ఛాన్స్ ని బంపర్ ఆఫర్ అనాల్సిందే.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉంది హేభా పటేల్. మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు కలిసి నటిస్తున్న 'ఈడో రకం ఆడోరకం'లో రాజ్ తరుణ్ కి జంటగా నటిస్తున్న హేభా... నిఖిల్ తో కలిసి ఓ మూవీ చేసేందుకు సైన్ చేసింది. ఇవి కాకుండా.. కొత్త డైరెక్టర్ బండి భాస్కర్ తీస్తున్న 'నేను.. నా బాయ్ ఫ్రెండ్స్' లో ఈమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీలో ఆఫర్ రావడంతో.. కెరీర్ ఫుల్ జోష్ లోకి వెళ్లిపోయిందని చెప్పాలి.