Begin typing your search above and press return to search.

మెగా క్యాంప్ లో కుమారి ఎంట్రీ?

By:  Tupaki Desk   |   18 March 2016 4:02 AM GMT
మెగా క్యాంప్ లో కుమారి ఎంట్రీ?
X
కుమారి 21ఎఫ్ అంటూ బోల్డ్ మూవీతో వచ్చిన హేభా పటేల్.. తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఏ రేంజ్ లో గ్లామర్ షో చేయగలదో చూపించి ఇండస్ట్రీ జనాలను కూడా బాగానే ఆకట్టుకుంది. వీటన్నటికి తోడు అరంగేట్రంలోనే బ్లాక్ బస్టర్ సాధించిందన్న రికార్డు కూడా ఉంది. అందుకే అమ్మడికి ఆఫర్లు వరుసగానే వస్తున్నాయి.

లేటెస్ట్ గా ఈ చిన్న 'నేను నా బాయ్ ఫ్రెండ్స్' అనే టైటిల్ పై రూపొందుతున్న చిత్రానికి సైన్ చేసింది. భాస్కర్ బండి అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించనుండగా.. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించేస్తోంది కూడా. రాజ్ తరుణ్ - విష్ణులు నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ 'ఈడో రకం ఆడో రకం' అనే మూవీలో రాజ్ తరుణ్ కి జంటగా నటిస్తుంది. నిఖిల్ నెక్ట్స్ మూవీలో కూడా హేభా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవన్నీ కాకుండా.. ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి కూడా ఓ ఆఫర్ ఫిక్స్ అయిందని టాక్ ఉంది.

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు హేభా పటేల్ ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 8న షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాలో కాజల్ ని గానీ, లావణ్య త్రిపాఠిని కానీ మెయిన్ హీరోయిన్ గా తీసుకోనున్నారు.