Begin typing your search above and press return to search.

లేను లేనంటున్న కుమారి!

By:  Tupaki Desk   |   18 July 2018 7:58 AM GMT
లేను లేనంటున్న కుమారి!
X
ఫిలిం నగర్లో అందరి పేరుకు ముందు 'కుమారి' ఉంటుందిగాని తెలుగు ప్రేక్షకులకు ఒకటే కుమారి... ఆమే.. హేబా పటేల్. 'కుమారి 21 F' సినిమాతో కుర్రకారును తనవైపుకు తిప్పుకున్న ఈ సుందరికి ఈమధ్య ఆఫర్లు తగ్గాయి గానీ ఆమెపై వచ్చే రూమర్లు తగ్గలేదు. ఆమెపై వచ్చిన లేటెస్టు రూమరే.. హేబా బిగ్ బాస్ ఎంట్రీ.

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో ఊపు పెంచడానికి నిర్వాహకులు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హేబాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకొస్తారని ఈమధ్య వార్తలు గుప్పుమన్నాయి. బిగ్ బాస్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోయినా చాలామంది ఇది నిజమే అనుకున్నారు. గత సీజన్ లో దీక్షా పంత్ ను తీసుకొచ్చినట్టే ఈసారి హేబా పటేల్ ను తీసుకొస్తారని కొంతమంది ఎదురు చూడడం మొదలు పెట్టారు కూడా.. కానీ కుమారి మాత్రం వాళ్ళందరి ఆశలపై నీళ్ళు చల్లింది.

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూమర్లపై స్పందించిన ఈ బ్యూటీ, తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో ఆమె 'నేను మా ఇంట్లోనే ఉన్నా.. మరే ఇంట్లో లేను.. ఏ రియాలిటీ షోలో పాల్గొనడం లేదు'అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. హేబా ఇల్లు - బిగ్ బాస్ ఇల్లు సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ ప్రస్తుతం '24 కిస్సెస్' పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తో అయినా తన కెరీర్ లో మళ్ళీ బిజీ అవుతానని నమ్మకంగా ఉంది.