Begin typing your search above and press return to search.

లక్కీ భామకు రెండో దెబ్బ తగిలేసిందే

By:  Tupaki Desk   |   17 April 2017 10:18 PM IST
లక్కీ భామకు రెండో దెబ్బ తగిలేసిందే
X
సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన కుమారి 21ఎఫ్ మూవీతో ఓవర్ నైట్ లో బోలెడంత క్రేజ్ సంపాదించేసింది కుమారి హెబ్బా పటేల్. ఆ తర్వాత కూడా ఈ భామ సక్సెస్ జోష్ కంటిన్యూ అయింది. ఈడో రకం.. ఆడో రకం అంటూ మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు కలిసి నటించిన మల్టీ స్టారర్ లో ఓ హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ కూడా హిట్ కావడంతో.. హెబ్బాకు లక్కీ గాళ్ ఇమేజ్ వచ్చేసింది. వరుసగా సినిమాలు చేతికి వచ్చేశాయి. ఇదే స్పీడ్ లో హెబ్బాను లీడ్ రోల్ లో పెట్టి.. 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్' మూవీ తీసేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది కానీ.. అమ్మడి ఇమేజ్ కి పెద్దగా డ్యామేజ్ జరగలేదు. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది హెబ్బా పటేల్. ఈ సినిమా ఫలితం ఏంటో కూడా ఇప్పటికే తేలిపోయింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన మిస్టర్.. కోలుకోవడం కష్టమే అని ఇప్పటికే ట్రేడ్ జనాలు తేల్చేశారు. కంటెంట్ తో పాటు మౌత్ టాక్ కూడా బ్యాడ్ గా ఉండడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్ గా చెప్పాలి. లక్కీ గాళ్ ఇమేజ్ తో వెలిగిపోతున్న హెబ్బా పటేల్ కు.. ఇప్పుడు వరుసగా రెండో ఎదురు దెబ్బ తగలేసిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/