Begin typing your search above and press return to search.

కుమారి ఖాతాకి పాతిక జమ

By:  Tupaki Desk   |   25 March 2016 7:30 AM GMT
కుమారి ఖాతాకి పాతిక జమ
X
కుమారి 21ఎఫ్ అంటూ కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించేసింది హేభా పటేల్. ఇప్పటివరకూ ఈమె యాక్టింగ్ ట్యాలెంట్ కు పెద్దగా మార్కులేం పడలేదు. మరోవైపు స్టార్ హీరోలతో సినిమా చేసింది కూడా లేదు. అయినా సరే.. హేభా పటేల్ ఇప్పుడు సినిమాకు 25 లక్షలకు పైగా డిమాండ్ చేసి మరీ తీసుకునే రేంజ్ కు చేరిపోయింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం హేభా పటేల్ కు 25లక్షలు ముట్టచెబుతున్నారని ఇండస్ట్రీ టాక్. హేభా డిమాండ్ బాగానే పెరిగిందని అర్ధమవుతుంది. కానీ ఈ రేంజ్ కి చేరడంలో.. బోలెడన్ని కిటుకులు అప్లై చేశారని టాక్ వినిపిస్తోంది.

కుమారి 21ఎఫ్ హిట్ కాగానే.. హేభా గురించి రూమర్స్ ను స్ప్రెడ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీలో కూడా కనిపించనుందనే టాక్ వినిపించింది. టాప్ ప్రొడ్యూసర్స్ ఈమె డేట్స్ అడుగుతున్నారనే మాటలు కూడా వినిపించాయి. ఇలాంటి టాక్ కారణంగా అనూహ్యంగా అతి తక్కువ టైంలో భారీ మొత్తాన్ని అందుకునే రేంజ్ కి హేభా చేరిపోయింది. ఇప్పుడు మెగా హీరోతో వైట్ల సినిమాలో పాతిక లక్షలు ముట్టడానికి కూడా ఇదే కారణం అంటున్నారు.