Begin typing your search above and press return to search.

'శ్యామ్‌ సింగ రాయ్‌' భారీ సెట్ డ్యామేజ్ అయిందా..?

By:  Tupaki Desk   |   21 May 2021 6:30 AM GMT
శ్యామ్‌ సింగ రాయ్‌ భారీ సెట్ డ్యామేజ్ అయిందా..?
X
నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''శ్యామ్‌ సింగ రాయ్‌''. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో నాని డిక్టెటివ్ పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్లుగా చాలా రోజుల పాటు పశ్చిమ బెంగాల్ లో చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్లాన్ చేసుకున్నారు.

దీని కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేశారు. కలకత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులను గుర్తు చేసే విధంగా దీనిని నిర్మించారు. లాక్ డౌన్ కు ముందు వరకు ఈ సెట్ లోనే షూటింగ్ జరిపారు. అయితే హైదరాబాద్ లో గత మూడు రోజులుగా రాత్రి సమయంలో భారీ వర్షాలు పడటంతో ఆ భారీ సెట్ డ్యామేజ్ అయిందట. నిజానికి కరోనా టైంలో కూడా రిస్క్ చేసి చిత్ర యూనిట్ షూటింగ్ చేసారు. కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఇటీవలే నిలిపివేశారు. ఈ క్రమంలో ఇప్పుడు వర్షాల వల్ల మళ్ళీ ఖర్చు చేసి సెట్ కి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

కాగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే విడుదలైన నాని - సాయి పల్లవి ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో జిషు సేన్‌ గుప్తా - రాహుల్‌ రవీంద్రన్‌ - మురళీ శర్మ - అభినవ్‌ గోమటం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జంగా సత్యదేవ్ ఈ చిత్రానికి స్టోరీ అందించగా.. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.