Begin typing your search above and press return to search.

ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ కి మీనింగ్ అత‌డు!

By:  Tupaki Desk   |   30 April 2022 4:39 AM GMT
ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ కి మీనింగ్ అత‌డు!
X
ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అంటే ఎవ‌రు? మ‌నోజ్ భాజ్ పాయ్ అని చెప్పొద్దు. ఫ్యామిలీతో తంటాలు ప‌డుతూనే తీవ్ర‌వాదాన్ని ఎదురించే ఆపీస‌ర్ గా అత‌డి అస‌మాన న‌ట‌న గురించి ప్ర‌తిరోజూ ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

కానీ ఇప్పుడు అంత‌కుమించి ప‌ర్ఫెక్ట్ ప్యామిలీ మ్యాన్ గా వెలిగిపోతున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్‌. ఇక్క‌డ ఫ్యామిలీ రాజ‌కీయాలేవీ లేవ్. ఓన్లీ ల‌వ్ లవ్ ల‌వ్. అర్థ‌నారీశ్వ‌రిలా న‌మ్ర‌త .. మ‌హేష్ ప్ర‌తి అడుగులోనూ ఉంది. అత‌డి అజేయ‌మైన స‌క్సెస్ రికార్డుల వెన‌క న‌మ్ర‌త పేరే ప్ర‌ముఖంగా వ‌నిపిస్తుంది. సినిమా.. బిజినెస్.. ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇలా అన్ని విధాలుగా త‌న‌కు అండ‌గా నిలుస్తున్నారు న‌మ్ర‌త‌. ఇక మ‌హేష్ కూడా కుటుంబ స‌భ్యుల‌తో త‌న తీరిక స‌మ‌యమంతా స్పెండ్ చేసేందుకు ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటారు. షూటింగ్ స‌మ‌యంలో త‌న కుటుంబాన్ని విడిచి ఉండ‌డం ఇష్టం లేక అంద‌రితో వెకేష‌న్ ఏర్పాట్లు చేస్తాడు.

ప్ర‌తిసారీ షూట్ ప్రారంభానికి ముందు ముగింపు త‌ర్వాత ఫ్యామిలీ వెకేష‌న్లు ఉంటాయి. ఇప్పుడు స‌ర్కార్ వారి పాట రిలీజ్ ముంగిట త‌దుప‌రి రాజ‌మౌళితో క‌థ‌న‌రంగంలోకి దూకే ముందు కుటుంబంతో భారీ వెకేష‌న్ ప్లాన్ చేసాడు. ఇంత‌కుముందు మ‌హేష్ స్టోరి సిట్టింగ్ కోసం దుబాయ్ వెళ్లాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే ఇప్పుడు కుటుంబంతో పారిస్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.

స‌తీమ‌ణి నమ్రత -పిల్లలు గౌతమ్ & సితారలతో మహేష్ బాబు తాజా చిత్రం పరిపూర్ణ కుటుంబ ఆల్బమ్ గా క‌నిపిస్తోంది. నమ్రత ప్యారిస్ లోని సుందరమైన ప్రదేశాలలో ఒక స్నేహితుడితో కలిసి మహేష్ బాబు- సితార మరియు గౌతమ్ లతో వెకేష‌న్ లో చేరార‌ట‌. వారంతా కలిసి పోజులిచ్చిన ఫోటోల‌ను న‌మ్ర‌త సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంది.

స్టార్ వైఫ్ క్రమం తప్పకుండా వారి కుటుంబ వెకేష‌న్ల‌కు సంబంధించిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తద్వారా అభిమానుల‌కు ప్రధాన యాత్రల‌ లక్ష్యాలను నిర్ధేశిస్తున్నారు.

అంతేకాదు అంద‌రి నోరూరించేలా కనిపించే వారి రుచికరమైన ఇటాలియన్ ఆహారాన్ని కూడా ఆమె స్నీక్ పీక్ రూపంలో షేర్ చేసింది. మ‌హేష్ ఈ ఫోటోల్లో తెల్లటి చొక్కా ధరించి ఎప్పటిలాగే అందంగా కనిపిస్తున్నాడు.

మే 12న విడుదలకు సిద్ధమవుతున్న తన రాబోయే చిత్రం సర్కారు వారి పాట ప్రమోషన్స్ ని ప్రారంభించే ముందు మహేష్ బాబు తన కుటుంబంతో కొంత సమయం తీసుకున్నాడు. అతను హైద‌రాబాద్ కి తిరిగి రాగానే సినిమా ప్రమోషన్ కోసం తన బృందంతో కలిసి ఉంటాడు.

మే 2న సర్కారు వారి పాట థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ప‌ర‌శురామ్ ధృవీకరించారు. ఇప్ప‌టికే మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కీర్తి సురేష్ కథానాయిక. మహేష్ బాబు కూతురు సితార కూడా ఈ సినిమాలోని పెన్నీ పాటతో అరంగేట్రం చేయనుంది.