Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు జోడీని ఇంకా ఫైనలైజ్ చేయలేదా..?

By:  Tupaki Desk   |   20 July 2021 7:40 AM GMT
ఎన్టీఆర్ కు జోడీని ఇంకా ఫైనలైజ్ చేయలేదా..?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - అగ్ర దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ (ఎన్టీఆర్ ఆర్ట్స్) సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందనుంది. 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత తారక్ - కొరటాల కలయికలో వస్తున్న సినిమా కావడంతో '#NTR30' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కొరటాల గత చిత్రాల మాదిరిగానే సామాజిక అంశాలకు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ జోడించి ఈ కథ సిద్ధం చేస్తున్నారని.. స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఇందులో నటించే హీరోయిన్ గురించి కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి.

కొరటాల 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ని '#NTR30' లో మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో లేటెస్టుగా బుట్టబొమ్మ పూజా హెగ్డే ని ఫైనలైజ్ చేసారని న్యూస్ వస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న 'ఆచార్య' సినిమాలో చరణ్ కు జోడీగా నటిస్తున్న పూజా కే ఓటేశారని చెప్పుకున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని ఇంకా కంఫర్మ్ చేయలేదని తెలుస్తోంది. పూజా హెగ్డే అనే వార్త‌ల్లో వాస్త‌వం లేదని అంటున్నారు. కాకపోతే పూజానే ఆల్మోస్ట్ ఫైనల్ చేసే అవ‌కాశం ఉందని.. కానీ డేట్స్ త‌దిత‌ర విష‌యంలో పూజా నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని టాక్. ప్రస్తుతం పూజా హెగ్డే చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది.

తెలుగులో 'రాధేశ్యామ్' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డే.. ప్రస్తుతం తమిళంలో దళపతి విజయ్ కు జోడీగా 'బీస్ట్' సినిమాలో నటిస్తోంది. 'సర్కస్' 'భాయిజాన్' అనే రెండు హిందీ సినిమాలు చేస్తోంది. ఇదే క్రమంలో మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చే #SSMB28 చిత్రంలో పూజాని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే నితిన్ అప్ కమింగ్ మూవీలో కూడా ఆమెనే హీరోయిన్ అని అంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్న పూజా డేట్స్ ఇష్యూ వస్తుందేమో.మ్ అని మరో ఆప్ష‌న్ కోసం కూడా NTR30 టీమ్ వెతుకున్న‌ట్లుగా స‌మాచారం. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కియారా అద్వానీ లేదా అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకుంటే పాన్ ఇండియా మార్కెట్ కి బాగుంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మరి త్వరలోనే తారక్ తో రొమాన్స్ చేసే హీరోయిన్ విషయంలో స్పష్టత వస్తుందేమో చూడాలి.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం ప్రమోషనల్ సాంగ్ షూట్ లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆగస్ట్ నెలాఖరుకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొరటాల తో NTR30 ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఆ తర్వాత 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ భారీ ప్రాజెక్ట్ రూపొందుతుంది.