Begin typing your search above and press return to search.

దివాళి త‌ర్వాత హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు!

By:  Tupaki Desk   |   3 Nov 2021 6:37 AM GMT
దివాళి త‌ర్వాత హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడుగా ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ముందుగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`.. ఆ త‌ర్వాత యంగ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లానాయ‌క్` చిత్రాలు ఆన్ సెట్స్ కి వెళ్లాయి. ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లిన త‌ర్వాత ప‌వ‌న్ థాట్ లో ఛేంజ్ వ‌చ్చింది. ముందుగా `భీమ్లా నాయ‌క్` ని పూర్తిచేసి రిలీజ్ చేయాల‌ని భావించారు. ఈ నేప‌థ్యంలో `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` షూటింగ్ ని ప‌క్క‌న‌బెట్టి `భీమ్లా నాయ‌క్` పై ఫోక‌స్ చేసారు. ఇప్ప‌టివ‌ర‌కూ భీమ్లా నాయ‌క్ చాలా భాగం షూటింగ్ కూడా పూర్త‌యింది. దాదాపు చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కి చేరుకుంది.

దీంతో క్రిష్ మ‌ళ్లీ లైన్ లోకి వ‌చ్చేసారు. బుధ‌వారం నుంచి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్ పునః ప్రారంభమైంది. ఇందులో కీల‌క న‌టులంతా జాయిన్ అవుతున్నారు. అయితే ప‌వ‌న్ మాత్రం దీపావ‌ళి పండ‌గ త‌ర్వాత టీమ్ తో జాయిన్ కానున్నారు. నాటి నుంచి ప‌వ‌న్ పై ఏక‌ధాటిగా షూటింగ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ షెడ్యూల్ ప‌వ‌న్ తో పాటు బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్.. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా పాల్గొంటారు. ఇందులో వీరిద్ద‌రు ముఖ్య‌మైన పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో ప‌వ‌న్ పై కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం.

దానికి సంబంధించిన ప‌క్కా ప్లాన్ తో క్రిష్ టీమ్ ముందుకు క‌దులుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టాకీ పార్టు స‌గానికి పైగా పూర్త‌యింది. క‌రోనా సెకెండ్ వేవ్ ఉగ్ర‌రూపం దాల్చ‌డం స‌హా.. ప‌వ‌న్ భీమ్లా నాయ‌క్ లో బిజీ అవ్వ‌డంతోనే ఇన్నాళ్లు చిత్రీక‌ర‌ణకు బ్రేక్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అంటే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కూడా మ‌రో నెల రోజుల్లో షూటింగ్ చుట్టేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇందులో ప‌వ‌న్ కి జోడిగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ కి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అన్న‌ట్టు దీపావ‌ళి వేళ ప‌వ‌న్ నుంచి ఏదైనా గ్లింప్స్ ఆశించ‌వ‌చ్చా లేదా? అన్న‌దానికి స‌రైన క్లారిటీ రాలేదు.