Begin typing your search above and press return to search.

రివ్యూలపై మరో స్టార్ అరిచేశాడు

By:  Tupaki Desk   |   26 Aug 2017 1:06 PM GMT
రివ్యూలపై మరో స్టార్ అరిచేశాడు
X
ఈ మధ్య కాలంలో సినిమా రివ్యూలపై కొందరు సినీ ప్రముఖులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే.. షాక్ కి గురి చేస్తోంది. ఎప్పుడు లేని విధంగా రివ్యూలను తప్పుబడుతూ మాట్లాడటం స్టార్స్ కి బాగా అలవాటైపోయిందనే కామెంట్స్ విబడుతున్నాయి. సినిమా రిజల్ట్ పై కొన్ని రివ్యూలను ఇచ్చే మీడియా సంస్థలపై ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు సినిమా యూనిట్ సభ్యులు.

ఇటీవల టాలీవుడ్ లో డీజే సినిమాపై వచ్చిన రివ్యూలకు ఆ సినిమా యూనిట్ కొంత ఆగ్రహం చెందిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు అదే తరహాలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మరియు ఏ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జీవి. ప్రకాష్ కుమార్. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రివ్యూలపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నిర్మాతలు ఎంతో కష్టపడి 100కోట్లు పెట్టి ఒక సినిమాను తెరకెక్కిస్తే అది బాలేదంటూ రివ్యూలతో పోల్చడం సరికాదని, కనీసం ఓ నాలుగు రోజులైనా ఆగి ఆ తర్వాత రివ్యూలను ఇవ్వాలని కోరాడు. అంతే కాకుండా ఒకరు చూడాలా వద్దా అనే నిర్ణయాన్ని ఇతరులు నిర్ణయించడం సరైనది కాదని చెబుతూ..ఒక సినిమా విజయాన్ని కలెక్షన్స్ నిర్ణయిస్తుందని ఏ సినిమాకైనా సరే తాను సపోర్ట్ గా నిలుస్తానని చెప్పాడు.

అయితే ఈ తరహా కామెంట్స్ చేయడానికి కారణం రీసెంట్ గా విడుదలైన అజిత్ "వివేగం" సినిమాపై నెగిటివ్ రివ్యూస్ రావడమే అని తెలుస్తోంది. వివేగం సినిమా పై తమిళ మీడియా ఏ మాత్రం పాజిటి రివ్యూస్ ని ఇవ్వలేదు. దాదాపు 100కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అజిత్ అభిమానులు చూస్తున్నారు గాని సాధారణ ప్రేక్షకులు ఆసక్తిచూపడం లేదు. దీంతో సినిమాకు భారీ దెబ్బ పడనున్నట్లు తెలుస్తోంది.