Begin typing your search above and press return to search.

'గల్లీ రౌడీ' మ‌రో 'రన్' అవ్వ‌దు క‌దా..!

By:  Tupaki Desk   |   5 April 2021 2:30 PM GMT
గల్లీ రౌడీ మ‌రో రన్ అవ్వ‌దు క‌దా..!
X
'ప్రస్థానం' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యువ హీరో సందీప్ కిషన్.. 'వెంకటాద్రి ఎక్సప్రెస్' 'బీరువా' 'నిను వీడని నీడను నేను' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన కెరీర్ ఆశించ‌నంత దూకుడుగా వెళ్లలేదనే అనుకోవాలి. కొంతకాలంగా సరైన సక్సెస్ కి దూరమైన సందీప్.. ఇటీవల తన 25వ సినిమా 'ఏ1 ఎక్స్ ప్రెస్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జాతీయ క్రీడ హాకీ నేపథ్యంలో తన బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా ఎందుకో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'గల్లీ రౌడీ' అనే సినిమాతో వస్తున్నాడు సందీప్.

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ - నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా 'గల్లీ రౌడీ' తెరకెక్కుతోంది. కోన వెంకట్‌ సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ - ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ కామెడీ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 21న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే గ‌తంలో సందీప్ కిషన్ - బాబీ సింహా కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'ర‌న్' అనే సినిమా థియేట‌ర్లలో వారం రోజులు కూడా ర‌న్ అవ్వ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్దరూ క‌లిసి మ‌రో ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మరి ఈసారి ఎలాంటి రిజ‌ల్ట్ వ‌స్తుందో చూడాలి. 'గల్లీ రౌడి' చిత్రానికి చౌరస్తా రామ్‌ మిరియాల సంగీతం సమకూరుస్తున్నాడు. సుజాత సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.