Begin typing your search above and press return to search.

చెర్రీ, మ‌హేష్‌ ల‌తో గౌత‌మ్‌ మీన‌న్‌!

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:22 PM GMT
చెర్రీ, మ‌హేష్‌ ల‌తో గౌత‌మ్‌ మీన‌న్‌!
X
`ఘ‌ర్ష‌ణ‌`, `ఏమాయ చేసావె`లాంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందించాడు గౌత‌మ్‌ మీన‌న్‌. బ్లాక్ బ‌స్ట‌ర్లు కాలేదు కానీ... రెండూ కూడా బాగానే ఆడాయి. ఆ రెండు సినిమాలతో తెలుగులో గౌత‌మ్‌ మీన‌న్‌ కి ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్ప‌డింది. అయితే ఆ త‌ర్వాత మాత్రం గౌత‌మ్‌ మీన‌న్ మ‌ళ్లీ తెలుగు సినిమా చేయ‌లేదు. ఇటీవలే `ఏమాయ చేసావె` త‌రహాలో నాగ‌చైత‌న్య‌ తో ఓ సినిమా ప‌ట్టాలెక్కించాడు. నితిన్‌ తో నిర్మాత‌గా `కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్‌` అనే సినిమా తీశాడు. ఆ చిత్రం త్వ‌ర‌ లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. కొరియ‌ర్ బాయ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా ఇటీవ‌ల గౌత‌మ్‌ మీన‌న్ హైద‌రాబాద్ వ‌చ్చారు. మీడియా తో ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ``ఏ మాయ చేసావె త‌ర్వాత తెలుగులో మ‌రో సినిమా చేయ‌లేక‌పోవ‌డానికి కార‌ణం హీరోలు దొర‌క్క‌పోవ‌డ‌మే`` అని చెప్పుకొచ్చాడు గౌత‌మ్‌ మీన‌న్‌.

త‌న‌కి మాత్రం రామ్‌ చ‌ర‌ణ్‌, మ‌హేష్‌ ల‌తో సినిమా చేయాల‌నుంద‌న్నాడు. ఆ ఇద్ద‌రితో చ‌ర్చ‌లు కూడా కొన‌సాగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే మ‌హేష్ ఇంకా చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. `బ్ర‌హ్మోత్స‌వం` త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, పూరి జ‌గన్నాథ్‌, రామ్‌ చ‌ర‌ణ్‌ ల‌తో సినిమాలు చేయాల్సి వుంది. అందుకే త‌దుప‌రి రామ్‌ చ‌ర‌ణ్‌ తోనే గౌత‌మ్‌ మీన‌న్ సినిమా చేయొచ్చ‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం శ్రీనువైట్ల సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత కూడా ఎవ్వ‌రికీ క‌మిట్ కాలేదు. సురేంద‌ర్‌ రెడ్డితో సినిమా చేయాల్సి వుంద‌ని ఆమ‌ధ్య చెప్పాడుకానీ... `కిక్‌2` రిజ‌ల్ట్‌ ని చూసుకొనే ఆయ‌న‌తో సినిమా చేయాలో వ‌ద్దో తేల్చుకొంటాడు చ‌ర‌ణ్‌. ఒక‌వేళ సురేంద‌ర్‌ రెడ్డితో సినిమా ఉన్న‌ప్ప‌టికీ వెన‌కాలో ముందో గౌత‌మ్‌ మీనన్‌ తోనూ చెర్రీ సినిమా ఉండొచ్చ‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.