Begin typing your search above and press return to search.

'పక్కా కమర్షియల్'కి వెళితే ఎంజాయ్ మెంట్ పక్కా!

By:  Tupaki Desk   |   13 Jun 2022 4:48 AM GMT
పక్కా కమర్షియల్కి వెళితే ఎంజాయ్ మెంట్ పక్కా!
X
గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. యూవీ - గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మించిన ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా అలరించనుంది. జూలై 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గోపీచంద్ మాట్లాడుతూ .. "ముందుగా నేను నా అభిమానులకు థ్యాంక్స్ చెబుతున్నాను. వీరందరూ చేయడం వల్లనే నేను ఈ రోజున ఇంతదూరం రాగలిగాను.

నా పుట్టిన రోజున ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. నా కోసం చాలా దూరం నుంచి వచ్చారు .. మీ ప్రేమ ఎలాంటిదో నాకు అర్థమైంది. ఈ కేరింతలు విని చాలా కాలమైంది .. చాలా సంతోషంగా ఉంది.

'పక్కా కమర్షియల్' గురించి చెప్పాలంటే ముందుకుగా యూవీ క్రియేషన్స్ వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మారుతి వంటి ఒక మంచి డైరెక్టర్ ను పరిచయం చేసినందుకు. మారుతి ఒక దర్శకుడిగానే కాదు .. వ్యక్తిగా కూడా చాలా మంచి మనిషి.

మారుతి వంటి ఒక మంచి దర్శకుడితో కలిసి పనిచేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ప్రొడక్షన్ లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కథ చాలా బాగా వచ్చింది. టీజర్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్స్ కి వస్తే ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్ లా అనిపిస్తుంది .. ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో రాశి ఖన్నా తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారు. 'లౌక్యం' సినిమా తరహాలో కామెడీ ఉంటుంది.

కామెడీకి మాస్ యాక్షన్ టచ్ ఉంటుంది. దీనిని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. పక్కాగా మీరంతా ఎంజాయ్ చేస్తారు. టిక్కెట్ల రేట్లు కూడా మీకు అందుబాటులో ఉండేలా ఉన్నాయి. ఈ సినిమాను థియేటర్స్ కి వెళ్లి చూడండి. మీ ఫ్యామిలీతో కలిసి పాప్ కార్న్ తింటూ ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి .. వాటిలో కలుద్దాం" అంటూ ముగించాడు.