Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ : ఫ్యాన్స్‌ కు ఉసూరుమనిపించే వార్

By:  Tupaki Desk   |   26 July 2020 6:30 AM GMT
రాధేశ్యామ్‌ : ఫ్యాన్స్‌ కు ఉసూరుమనిపించే వార్
X
ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’ లో రానా కీలకమైన పాత్రలో కొన్ని నిమిషాల పాటు కనిపించబోతున్నట్లుగా ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ రానాలు కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబోను యూవీ క్రియేషన్స్‌ వారు రాధేశ్యామ్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు రాధాకృష్ణ కీలకమైన ఆ గెస్ట్‌ రోల్‌ ను రానాతో చేయించబోతున్నాడు.. అందుకు రానా కూడా ఓకే చెప్పాడనే ప్రచారం జరిగిన నేపథ్యంలో తాజాగా ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.

ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ రాధేశ్యామ్‌ చిత్రంలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చాడు. ఒక్క మాటతో ఇన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. ప్రభాస్‌ తో మళ్లీ రానా అంటూ అభిమానులు కాస్త ఆసక్తి చూపించారు. కాని రానా రూమర్‌ అంటూ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయిన ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కరోనా పరిస్థితులు కాస్త అయినా కుదుట పడ్డ తర్వాత ఈ చిత్రాన్ని మళ్లీ సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.

యూరప్‌ లో ఈ సినిమా షూటింగ్‌ జరపాల్సి ఉంది. అక్కడకు ఈ సమయంలో వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కనుక రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే యూరప్‌ సెట్‌ ను ప్రస్తుతం వేయిస్తున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి సినిమా షూటింగ్‌ పున: ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు నటిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెల్సిందే.