Begin typing your search above and press return to search.

24 నిర్మాత.. నిరాహార దీక్ష చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   14 May 2016 4:00 PM IST
24 నిర్మాత.. నిరాహార దీక్ష చేస్తున్నాడు
X
పైరసీ భూతం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది ఓ ఉదాహరన అయితే.. ఇప్పుడా స్థానం సూర్య నటించిన 24కు ఇవ్వాల్సిందే. బెంగళూరులోను పీవీఆర్ ఓరియన్ మాల్ లో ఈ మూవీ పైరసీ జరిగిందని నిర్ధారణ జరిగింది.

క్యూబ్ టెక్నాలజీ ద్వారా కనిపించకుండా వేసిన వాటర్ మార్క్ లతో పైరసీ కాపీని గుర్తించగలిగారు. 24 రిలీజ్ రోజు అయిన మే 6న ఉదయం 9.45 ఆటకే పైరసీ చేసేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇప్పుడు నిరాహారదీక్షకు దిగాడు. 'శుక్రవారం సాయంత్రం నుంచి నేను నిరాహార దీక్ష చేస్తున్నా' అని జ్ఞానవేల్ రాజా ప్రకటించాడు.

ఇప్పటికైనా ఇండస్ట్రీ అంతా కలిసొచ్చి, పైరసీ పై పోరాడాలని పిలుపునిచ్చిన 24 నిర్మాత.. తాను ఈ చిత్రం పైరసీపై మాత్రమే పోరాడ్డం లేదని అన్నాడు. బడా బడా మాల్స్ లోనే ఇలా పైరసీ జరిగితే.. నిర్మాతల పరిస్థితి ఏంటి అని నిలదీశాడీయన.