Begin typing your search above and press return to search.

మళ్లీ ట్రెండ్‌ అవ్వడానికి శ్రీరామ్‌ రెడీ

By:  Tupaki Desk   |   27 Feb 2020 7:30 AM GMT
మళ్లీ ట్రెండ్‌ అవ్వడానికి శ్రీరామ్‌ రెడీ
X
అల వైకుంఠపురంలోని సామజవరగమన ఇంకా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలోని నీలి నీలి ఆకాశం పాటతో సిద్‌ శ్రీరామ్‌ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాడు. మూడు నెలల నుండి అల వైకుంఠపురంలో సినిమాలోని పాట ట్రెండ్‌ అవుతున్నాయి అంటే అది ఖచ్చితంగా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ వల్లే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత ప్రదీప్‌ క్రేజ్‌ ను సిద్‌ శ్రీరామ్‌ వాయిస్‌ యాడ్‌ అవ్వడం తో నీలి నీలి ఆకాశం సోషల్‌ మీడియా లో టాప్‌ లో ట్రెండ్‌ అవుతూనే ఉంది.

తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్‌ శ్రీరామ్‌ రెడీ అయ్యాడు. ఈయన తాజాగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా నటిస్తున్న మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలో ఒక పాట పాడాడు. ఆ పాటను మార్చి 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ పాటతో మరోసారి సిద్‌ శ్రీరామ్‌ సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేయడం ఖాయం అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగులో స్టార్‌ హీరోలు అంతా కూడా ఇప్పుడు సిద్‌ శ్రీరామ్‌ ను కోరుకుంటున్నారు. కనీసం ఒక్క పాట అయినా తమ సినిమాల్లో ఆయనతో పాట పాడివ్వాలని సంగీత దర్శకులకు సూచిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ సింగర్‌ గా ఈయన దూసుకు పోతున్నాడు. అఖిల్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ చిత్రంలోని మనసా.. మనసా.. పాట కూడా క్లిక్‌ అయితే మనోడు మరింతగా పైకి ఎదగడం ఖాయం.