Begin typing your search above and press return to search.

భ‌ర్త‌తో క‌లిసి హీరోయిన్ మోసం..కేసు న‌మోదు

By:  Tupaki Desk   |   5 Jun 2018 4:29 AM GMT
భ‌ర్త‌తో క‌లిసి హీరోయిన్ మోసం..కేసు న‌మోదు
X
దాదాపు ప‌దిహేనేళ్ల క్రితం అమ్మాయిలు అబ్బాయిలు అనే సినిమా వ‌చ్చింది గుర్తుందా? ఆ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది డెబ్లీనా బెన‌ర్జీ. త‌న భ‌ర్త క‌మ్ టీవీ న‌టుడు గుర్మీత్ చౌద‌రితో క‌లిసి మోసానికి పాల్ప‌డిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఆమెపై తాజాగా కేసు న‌మోదైంది.

బాలీవుడ్ లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ వీరిద్ద‌రూ మోసం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. రాజ‌స్థాన్ లోని నోఖా పోలీస్ స్టేష‌న్లో ఒక వ్య‌క్తి కంప్లైంట్ చేశారు. త‌న‌కు బాలీవుడ్‌లో అవ‌కాశాలు ఇప్పిస్తామంటూ డెబ్లీనా.. ఆమె భ‌ర్త ఇద్ద‌రు క‌లిసి త‌న ద‌గ్గ‌ర నుంచి రూ.11ల‌క్ష‌లు తీసుకున్న‌ట్లుగా బాధితుడు వాపోతున్నాడు.

వారిద్ద‌రూ త‌న‌ను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశారు. త‌న‌పై కేసు న‌మోదైన విష‌యాన్ని తెలుసుకున్నంత‌నే గుర్మీత్ ఆమె భ‌ర్త ఇద్ద‌రూ త‌మ‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల్ని ఖండించారు. త‌మ‌కు వ్యతిరేకంగా కేసు పెట్టిన వ్య‌క్తి గురించి త‌మ‌కు తెలీద‌ని.. త‌మ పేరును త‌ప్పుగా వాడుతున్న‌ట్లుగా వారు మండిప‌డుతున్నారు. అత‌గాడితో త‌మ‌కు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవ‌ని పేర్కొన్నారు. మ‌రి.. ఇందులో నిజం ఎంత‌న్న‌ది విచార‌ణాధికారులు తేల్చాల్సి ఉంది.