Begin typing your search above and press return to search.

నాగార్జున‌కు నాలుగు నెల‌లు విశ్రాంతి

By:  Tupaki Desk   |   15 Sep 2022 2:30 AM GMT
నాగార్జున‌కు నాలుగు నెల‌లు విశ్రాంతి
X
బ్ర‌హ్మాస్త్ర లాంటి భారీ పాన్ ఇండియా మూవీలో న‌టించాడు నాగార్జున‌. ఈ మూవీ వ‌సూళ్ల తీరుపై ఆనందం వ్య‌క్తం చేశారు. నాగ్ న‌టించిన ఘోస్ట్ అక్టోబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వ‌రుస చిత్రాల కోసం నాగార్జున గ్యాప్ లెస్ గా శ్ర‌మించారు. తాజా స‌మాచారం మేర‌కు నాలుగు నెలల పాటు నాగ్ విశ్రాంతి తీసుకోనున్నార‌ని స‌మాచారం. గత రెండేళ్లుగా విరామం లేకుండా పనిచేస్తుండ‌డ‌మే దీనికి కార‌ణం. బంగార్రాజు- బిగ్ బాస్ నాన్ స్టాప్- ద ఘోస్ట్- బ్రహ్మాస్త్ర- 'బిగ్ బాస్ తెలుగు 6' ఈ 24 నెలల్లో ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ లు. ఇవ‌న్నీ భారీగా శారీర‌క శ్ర‌మ‌తో పాటు మాన‌సికంగా అల‌సిపోయేంత పెద్ద ప్రాజెక్టులు.

బ్రహ్మాస్త్ర విడుదలై మంచి ఫ‌లితం అందుకుంది. 'ద ఘోస్ట్' వచ్చే నెలలో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నందున నాగార్జున కొంత‌ స్పీడ్ తగ్గించాలనుకుంటున్నారు. ''పని నుండి నాకు కొంత విశ్రాంతి కావాలి. వచ్చే మూడు నెలల వరకు సినిమాల గురించి ఆలోచించను'' అని నాగార్జున అన్నారు. నాగార్జున 2023లో మాత్రమే కొత్త సినిమాలు చేయాల‌నుకుంటున్నారు.

మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన 'లాల్ సింగ్ చడ్డా' భారీ అంచ‌నాల న‌డుమ రిలీజై డిజాస్ట‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ‌లితానికి అమీర్ అవాక్క‌య్యాడు. ఇదే సినిమాతో కింగ్ నాగార్జున న‌ట‌వార‌సుడు నాగ‌చైత‌న్య బాలీవుడ్ కి ప‌రిచ‌య‌మ‌య్యాడు. కానీ అత‌డి తొలి చిత్రానికి ఇలాంటి రిజ‌ల్ట్ రావ‌డాన్ని డైజెస్ట్ చేసుకోలేని ప‌రిస్థితి. అస‌లింత‌కీ ఈ సినిమా ఫ్లాప్ కి బ‌హిష్క‌ర‌ణ ఉద్య‌మానికి ఏదైనా సంబంధం ఉందా? అని అడిగితే కింగ్ నాగార్జున ఇచ్చిన ఆన్ష‌ర్ షాకిచ్చింది.

నాగార్జున బహిష్కరణ ధోరణి గురించి మాట్లాడుతూ.. బహిష్కరణ పోకడలతో పర్వాలేదు.. 'లాల్ సింగ్ చడ్డా' బాగా ఆడ‌లేదు. ఇక్క‌డ కంటెంట్ మాత్రమే ముఖ్యం! అని నాగార్జున అక్కినేని అభిప్రాయపడ్డారు. ఈ విష‌యాన్ని ఇప్పటికే చాలా హిందీ-తెలుగు సినిమాలు నిరూపించాయని అన్నారు.

బహిష్కరణ ధోరణి కొంతకాలంగా వార్తల్లో ఉంది. లాల్ సింగ్ చడ్డా- రక్షా బంధన్ -లైగ‌ర్ వంటి భారీ-బడ్జెట్ సినిమాలు సహా గత నెలలో విడుదలైన అనేక సినిమాలు ఈ త‌ర‌హా రద్దు సంస్కృతికి టార్గెట్ అయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అంతకు ముందు సామ్రాట్ పృథ్వీరాజ్- రన్ వే 34- హీరోపంతి 2 వంటి హిందీ చిత్రాలు కూడా ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించడంలో విఫలమయ్యాయి.

2022లో థియేటర్లలో విడుదలైన అన్ని హిందీ చిత్రాలలో మూడు మాత్రమే బాగా ఆడాయి. గంగూబాయి కతియావాడి- ది కాశ్మీర్ ఫైల్స్- భూల్ భూలయ్యా 2 మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాయి. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వ‌సూళ్ల‌ను సాధించగలిగాయి. చాలా నెలల సుదీర్ఘ విరామం తర్వాత బాయ్ కాట్ పిలుపు న‌డుమ‌ సెప్టెంబర్ 9న విడుదలైన రణబీర్ కపూర్- అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ డ్రై రన్ కు ముగింపు పలికింది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ 'బ్రహ్మాస్త్ర' బాక్సాఫీస్ వద్ద బాగా టేకాఫ్ అయ్యిందని ముంబై మీడియా చెబుతోంది. టికెట్ విండో వద్ద ఈ చిత్రం డబ్బును రాబ‌డుతోంద‌ని.. వాణిజ్య నిపుణులు పరిశ్రమలోని వ్యక్తుల ఆనందానికి కార‌ణ‌మైంద‌ని కూడా చెబుతున్నారు.

ఇప్పుడు బ్రహ్మాస్త్ర విజయం స‌హా బహిష్కరణ ధోరణి గురించి మాట్లాడుతూ నాగార్జున అక్కినేని ప్ర‌ముఖ మీడియాతో ప్రత్యేక చాట్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ-'' గంగూబాయి కతియావాడి -భూల్ భూలయ్యా 2- RRR వంటి చిత్రాలు మంచి కంటెంట్ కారణంగా బాగా ఆడాయ‌ని అన్నారు. లాల్ సింగ్ చద్దా బాగా ఆడ‌లేద‌ని.. అయితే బ్రహ్మాస్త్ర బాగా వ‌సూలు చేస్తోంద‌ని పేర్కొన్న ఆయన బహిష్కరణ ధోరణి సినిమా పరిశ్రమను పెద్దగా ప్రభావితం చేయదని అన్నారు. బ్రహ్మాస్త్ర విజయం.. సినిమాలో తన పాత్రకు వచ్చిన స్పందన గురించి సంతోషం వ్యక్తం చేస్తూ.. నాగార్జున సోషల్ మీడియాలో ఎటువంటి ప్రతికూల పోకడలు మంచి సినిమా విజయవంతం కాకుండా ఆపలేవని పేర్కొన్నారు. బహిష్కరణ పోకడలతో పర్వాలేదని.. కంటెంట్ మాత్రమే ముఖ్యం అని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా హిందీ తెలుగు సినిమాలు ఈ విష‌యాన్ని నిరూపించాయని అన్నారు.

మ‌రిన్ని విష‌యాలు మాట్లాడుతూ- గతంలో వారం తర్వాత పత్రికలలో సమీక్షలు వచ్చేవని.. ప్రజలు వాటిని పట్టించుకోలేదని.. ఇప్పుడు సమీక్షలు ప్రతిచర్యలు తక్షణమే ప్రజల నుండి బయటకు వస్తున్నాయని అన్నారు. IMDbలో రేటింగ్ ని తనిఖీ చేసిన తర్వాత కొన్నిసార్లు సినిమా లేదా వెబ్ సిరీస్ ని చూడాలని నిర్ణయించుకోవ‌చ్చ‌ని అన్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్రలో నాగార్జున అక్కినేని నందియాస్త్ర పాత్రలో కనిపించారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 లో న‌టిస్తారా లేదా అనే దానిపైనా ఓపెన‌య్యారు. పార్ట్ 2 లో కనిపిస్తానా లేదా అనే దాని గురించి తాను ఏమీ చెప్పే స్థితిలో లేనని అన్నారు. అయితే సీక్వెల్ లో మంచి పాత్రలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు. 19 ఏళ్ల విరామం తర్వాత నాగార్జున హిందీ సినిమాల్లోకి తిరిగి ప్ర‌వేశించారు. బ్రహ్మాస్త్రతో ఇది సాధ్య‌మైంది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే అక్టోబర్ 5 న విడుదల కానున్న 'ది ఘోస్ట్‌'లో నాగ్ తదుపరిగా కనిపిస్తాడు. ఈ చిత్రం చిరు- సల్మాన్ ఖాన్ ల 'గాడ్ ఫాదర్‌'తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌నుంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.