Begin typing your search above and press return to search.

'ఆచార్య' కు న‌లుగురు నాయిక‌లెందుకు?

By:  Tupaki Desk   |   19 July 2020 4:10 AM GMT
ఆచార్య కు న‌లుగురు నాయిక‌లెందుకు?
X
మెగా స్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా ఆచార్య చిత్రానికి సంబంధించి ప‌లు ఊహాగానాలు వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌వ్వ‌గా.. ఇంకా ఇందులో క‌థానాయిక‌లు ఎవ‌రు? అన్న‌ది డిసైడ్ కాక‌పోవ‌డంపై అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. వైరస్ సంక్షోభం వ‌ల్ల‌ కొంత విరామం తీసుకోవలసి వచ్చింది.

ఇంకా 60శాతం షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. త్వ‌ర‌లోనే త‌దుప‌రి చిత్రీక‌ర‌ణ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌ల‌ కొర‌టాల ప‌లువురు క‌థానాయిక‌ల్ని సంప్ర‌దించార‌ని ప్ర‌చారం సాగుతోంది. తొలుత త్రిష‌ను క‌థానాయిక‌గా ఎంపిక చేసినా.. అనూహ్యంగా త‌నకు కుద‌ర‌ద‌ని ఖ‌రాకండిగా ద‌ర్శ‌కుడికి తెలిపింది. ఆ త‌ర్వాత కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుందని ప్ర‌చార‌మైంది.

తాజా స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రంలో మొత్తం న‌లుగురు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. కాజ‌ల్ ప్ర‌ధాన నాయిక కాగా రెజీనా స్పెషల్ నెంబర్ ‌లో న‌ర్తిస్తుంది. ఇందులో స్పెషల్ రోల్ పోషిస్తున్న రామ్ చరణ్ కి నాయిక‌గా కియ‌రా అద్వాణీని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. కియారా అద్వానీ అతిథి పాత్రలో మాత్ర‌మే క‌నిపిస్తుంది.

ఇక ఇదే సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉంటుందని.. అది సినిమా గతిని మారుస్తుందని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా ఆ ప్రత్యేక పాత్రను పోషిస్తోంది. కాబట్టి ఆచార్యలో నలుగురు హీరోయిన్లు ఖాయ‌మైన‌ట్టేన‌ని భావిస్తున్నారు. అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో న‌టించిన త‌మ‌న్నాకు మంచి పేరొచ్చింది. అందుకే మెగాస్టార్ వెంట‌నే త‌న‌ని రిపీట్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. న‌లుగురు నాయిక‌ల‌తో బాస్ రొమాన్స్ పీక్స్ లో ఉంటుంద‌ని ఫ్యాన్స్ ఒక‌టే ఖుషీ అవుతున్నారు మ‌రి.