Begin typing your search above and press return to search.

రంగస్థలం నుండి ఆ నలుగురు!

By:  Tupaki Desk   |   9 Sep 2018 4:37 PM GMT
రంగస్థలం నుండి ఆ నలుగురు!
X
ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదు తెలీదు కానీ ఒక హిట్ మాత్రం మీ జీవితాన్ని మీరు ఊహించలేనంతగా మార్చేస్తుంది. అదే ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో మీ పాత్ర కనుక ఉంటే మీరు 'తంతే బూరెల బుట్టలో పడ్డట్టే'. సామెత ఓల్డ్ గా ఉంది అనుకుంటే 'తంతే పేద్ద కేఎఫ్సి చికెన్ బక్కెట్ లో పడ్డట్టే' అని మార్చుకుందాం. ఈ విషయాన్ని 'బాహుబలి'కి పని చేసిన ఎవరిని అడిగినా చెప్తారు.

మరీ ఆ రేంజ్ లో కాకపోయినా 'రంగస్థలం' సినిమాకు పనిచేసిన వారి పరిస్థితి దాదాపు అలాగే ఉంది. 'రంగస్థలం' సినిమాకు పనిచేసిన వారిలో నలుగురు ఇప్పుడు డైరెక్టర్లు కానున్నారు. అందులో ఒకరు బుచ్చిబాబు. మైత్రీ బ్యానర్- సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించే సినిమా తో బుచ్చిబాబు డైరెక్టర్ గా తన లక్కు ను టెస్ట్ చేసుకొబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిందట.. ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. 'రంగస్థలం' సినిమా కు పనిచేసిన నలుగురున్న రైటింగ్ టీమ్ లో సుకుమార్ కు ఈయన ఒక అసిస్టెంట్. ఇక మిగతా ముగ్గురూ కూడా అదే బాటలో ఉన్నారు.

మరొక అసిస్టెంట్ కాశి కూడా స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నాడట. ఈ కాశి డెబ్యూ సినిమాకు ఈమధ్యనే ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగిందట. సుకుమార్ తన ఫ్రెండ్స్ లో ఒకరిని ఈ కాశి కి ప్రొడ్యూసర్ గా సెట్ చేస్తున్నాడట. ఇక మరో ఇద్దరు రైటింగ్ టీమ్ సభ్యులు శ్రీనివాస్.. వెంకట్ కూడా దర్శకులుగా తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు స్క్రిప్టులు సిద్ధం చేసుకుంటున్నారట. వీళ్ళందరికీ సుకుమార్ గట్టిగా సపోర్ట్ ఇస్తున్నాడట. ఇప్పటికే సుకుమార్ తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ ద్వారా కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రోత్సాహానికి ఫోర్త్ గేర్ వేసినట్టు అనిపించడం లేదూ?