Begin typing your search above and press return to search.

ఆ విషయాలు మర్చిపోండి: అనసూయ

By:  Tupaki Desk   |   30 Oct 2019 6:38 AM GMT
ఆ విషయాలు మర్చిపోండి: అనసూయ
X
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న 'మీకు మాత్రమే చెప్తా' నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అనసూయ భరద్వాజ్.. అభినవ్ గోమటం ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ జెనరేషన్ యూత్ కు కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తరుణ్ భాస్కర్ తో పాటు ఆ అనసూయ కూడా పాల్గొంటోంది. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ అనసూయకు ఎదురయ్యే కామన్ ప్రశ్నఒకటి ఉంది. అదేంటంటే "గతంలో అర్జున్ రెడ్డి రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండపై విమర్శలు గుప్పించారు కదా.. మరి ఇప్పుడు ఎలా విజయ్ నిర్మించిన సినిమాలో పని చేశారు?" ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి అనసూయ.. గతంలో జరిగిన విషయాలు ఇద్దరం మర్చిపోయామని.. అవేమీ తనపై కానీ విజయ్ పై కానీ ప్రభావం చూపించలేదని చెప్తోంది. వీలైంతవరకూ ఆ టాపిక్ ను కొనసాగనివ్వకుండా 'గతం గతః' అన్నట్టుగా వదిలెయ్యమని ఇంటర్వ్యూయర్లను కోరుతోంది.

'మీకు మాత్రమే' సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఫుల్ గా ఎంజాయ్ చేశానని ఈ సినిమా ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఒక విషయం స్పష్టం.. ఏ కెరీర్లో అయినా ఎదగాలంటే లౌక్యం అవసరం. అప్పుడేదో జరిగిందని ఆఫర్ ను రిజెక్ట్ చేయకుండా అనసూయ లౌక్యంగానే పని పూర్తి చేసిందనే కామెంట్ వినిపిస్తోంది. పైగా ఇంటర్వ్యూలలో అప్పటి విమర్శల గురించి అడిగితే సమాధానం దాటవేయడం లౌక్యం కాక ఇంకేంటి?