Begin typing your search above and press return to search.

మణిరత్నం ఆఫీసులో ఏం జరిగింది?

By:  Tupaki Desk   |   9 Aug 2016 9:00 PM IST
మణిరత్నం ఆఫీసులో ఏం జరిగింది?
X
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆఫీస్ లో అనుకోకుండా ఒక అగ్ని ప్రమాదం జరగడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం తన కొత్త సినిమా కాట్రు వెలియాడై సినిమా షూటింగు పనుల్లో బిజీగా ఉన్న మణీ సార్ కు ఒక్కసారిగా బీభత్సమైన షాక్ తగలడంతో టోటల్ కోలీవుడ్ ఇండస్ర్టీ షాక్ తినేసింది.

వివరాల్లోకి వెళితే.. మణి సార్‌ కు చెన్నయ్ లోని అభిరామపురంలో ఒక ఆఫీస్ ఉంది. చాలా సంవత్సరాల నుండి అదే ఆఫీస్ వాడుతున్నారాయన. తన కొత్త సినిమా పనులు కూడా అక్కడే చేశారు. ఈ మధ్యన ఊటి వెళ్ళి తొలి షెడ్యూల్ షూటింగ్ ముగించుకుని వచ్చిన మణిరత్నం.. అక్కడే తన సినిమా తాలూకు ఎడిటింగ్ పనులు కూడా చేయిస్తుంటారు. అయితే మంగళవారం తెల్లవారుజామున సడన్ గా అగ్ని ప్రమాదం జరగడంతో.. వెంటనే ఫైర్ డిపార్టుమెంటుకు అక్కడి సెక్యూరిటీ వారు ఫోన్ చేశారట. షార్టు సర్క్యూట్ కారణంగా జరిగిందనుకుంటున్న ఈ ఫైర్ యాక్సిడెంట్ కారణంగా.. మణిరత్నం ఆఫీసులోని లక్షల రూపాయల ఫర్నిచర్ తో పాటా చాలా విలువైన స్ర్కీప్టులు వగైరా కూడా నాశనం అయిపోయాయట.

అయితే ఇప్పుడు అందరికీ వచ్చిన సందేహం ఏంటంటే.. ఇప్పటివరకు షూట్ చేసిన సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ఏమైనా డ్యామేజ్ అయ్యుంటుందా అనే. ఈ విషయంపై ఇంతవరకు మణిరత్నం ఎటువంటి కామెంటూ చేయలేదు.