Begin typing your search above and press return to search.

తారక్ తీరుతో ఫ్యాన్స్ అప్సెట్..!

By:  Tupaki Desk   |   25 Feb 2022 9:29 AM GMT
తారక్ తీరుతో ఫ్యాన్స్ అప్సెట్..!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని బిగ్ స్క్రీన్ మీద చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కాలం వెండి తెర మీద కనిపించని టాలీవుడ్ స్టార్ హీరో తారక్. చివరగా 2018 లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో కనిపించిన నందమూరి వారసుడు.. అప్పటి నుంచి 'ఆర్.ఆర్.ఆర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రానికే అంకితమయ్యాడు.

తారక్ నుంచి ఇన్నేళ్ళలో మరో సినిమా రాకపోవడం పట్ల అభిమానులను తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు మహేష్ బాబు - ప్రభాస్ - రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరూ ఒక సినిమా పూర్తైన వెంటనే మరో కొత్త ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తుంటే.. ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు NTR30 షూటింగ్ స్టార్ట్ చేయకపోవడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతోంది.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే మహేష్ బాబు - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి ఇతర హీరోలు రెగ్యులర్‌ గా అప్‌డేట్‌లు ఇవ్వడంతో పాటుగా వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వాళ్ళు సినిమాలు చేయకపోయినా వారి సతీమణులు నమ్రత - ఉపాసన - స్నేహా రెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఏదో ఒక పోస్ట్ ద్వారా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంటారు.

కానీ ఎన్టీఆర్ మరియు అతని భార్య లక్ష్మీ ప్రణతి దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. లక్ష్మీ ప్రణతి చాలా ప్రైవేట్ పర్సన్. తారక్ సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లే.. ఆమె కూడా తన భర్త వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో ఎలాంటి విషయాలను షేర్ చేసుకోదు. దీంతో ఓవైపు సినిమాలు రిలీజ్ అవ్వక.. మరోవైపు యంగ్ టైగర్ గురించి తెలుసుకునే వేదిక దొరక్కకపోవడంతో ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ముందుగా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పుడు ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో బాగా సందడి చేసారు. సినిమా వాయిదా పడటంతో మళ్ళీ ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్ - చరణ్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టారర్ 2022 మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కచ్చితంగా నందమూరి ఫ్యాన్స్ దాహాన్ని తీరుస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే కొరటాల శివ దర్శకతవరంలో #NTR30 సినిమా తెరకెక్కనుంది. ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా అని సమాచారం. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదే క్రమంలో బుచ్చిబాబు - ప్రశాంత్ నీల్ లతో తారక్ పాన్ ఇండియా చిత్రాలు ప్లాన్ చేసుకున్నారు.