Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రి పేరెత్తితే మండిపోతున్న ఫ్యాన్స్ !

By:  Tupaki Desk   |   18 April 2022 10:53 AM GMT
ఆ ఇద్ద‌రి పేరెత్తితే మండిపోతున్న ఫ్యాన్స్ !
X
ఆ ఇద్ద‌రి హీరోల అభిమానుల ఓపిక న‌శించింది. స‌హనం క్షీణించింది. ఎంత కాలం ఎంత కాంల ఇంకెతం కాలం ఇలా. ఇన్నాళ్లు పెద‌వి దాట‌ని మౌనాన్ని ఒక్కోక్క‌రుగా వీడుతున్నారు. మా స‌హ‌నాన్నే ప‌రీక్షించారంటూ మండిప‌డుతున్నారు. సోష‌ల్ మీడియ వేదిక‌గా త‌మ బాధ‌ని వెళ్లగ‌క్కుతున్నారు. అందుకు ప్ర‌ధాన కార‌కుల‌పైనే అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రా ఇద్ద‌రుహీరోలు? ఎందుకంత‌లా టార్గెట్ అయ్యారు? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ 30వ చిత్రం విష‌యంలో నెల‌కొన్న‌తార‌క్ అభిమానుల అస‌హనం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే సెట్స్ కు వెళ్లాల్సిన ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు. దానికి తోడు 'ఆర్ ఆర్ ఆర్' తార‌క్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధ‌న్యం లేదంటూ అభిమానుల మండిపాటు తార‌క్ 30 వ చిత్రంపై ప్ర‌భావం చూపింది. వీలైనంత త్వ‌ర‌గా ఆ అసంతృప్తిని తొల‌గించాల్సిన బాధ్య‌త తార‌క్ పైంది.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా సెట్స్ లో ఉన్న‌ప్పుడు వ‌చ్చిన ప్ర‌క‌ట‌న ఇంత వ‌ర‌కూ కార్య‌రూపం దాల్చ‌లేదు.ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు నేమ్ సేక్ అప్ డేట్స్ ఇస్తూ మ‌రింత అస‌హానికి గుర‌య్యేలా చేస్తున్నార‌ని ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. స‌రిగ్గా ఇదే ప‌రిస్థితిని ఇప్పుడు మ‌హేష్ ఎదుర్కుంటున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'స‌ర్కారు వారి పాట‌' పాట అప్ డేట్స్ విష‌యంలో మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని.. కొన్ని ఆన్ సెట్స్ చిత్రాల‌న్ని త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో మేక‌ర్స్ పై మ‌హేష్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. 'వ‌ర‌స్ట్ టీమ్ ఎస్ వీపీ' అంటూ ట్విట‌ర్ వేదిక‌గా ట్రోల్ చేసి ట్రెండింగ్లో నిలిచేలా చేసారు. మూడు వారాల వ్య‌వ‌ధిలో సినిమా రిలీజ్ ఉంది. ఇంకా టీజ‌ర్..పాట‌లు..ట్రైల‌ర్ రిలీజ్ కాలేదు. ఇంకా బీటీఎస్ చిత్రాలు ఇస్తామ‌ని చెబుతున్నారు. మేము ఏమైనా పిచ్చోళ్ల‌లా క‌నిపిస్తున్నామ‌? అని మ‌హేష్ అబిమాని ఒక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేసాడు.

ఈసంద‌ర్భంగా ఇక్క‌డో విష‌యం గుర్తు చేసుకోవాలి. గ‌తంలో మ‌హేష్ అభిమానుల ను ఉద్దేశించి కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ''త‌న సినిమా న‌చ్చ‌క‌పోతే త‌న అభిమానులే సినిమా చూడ‌ర‌ని.. ఇలాంటి జెన్యూన్ అభిమానులు త‌న‌కు మాత్రమే'' ఉంటార‌ని అన్నారు. ఆయ‌న చెప్పింది నిజ‌మే అన‌డానికి ఇదొర‌క ర‌క‌మైన ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు.

కొంత‌మంది స్టార్ హీరోల అభిమానుల్లో ఇలాంటి నిజాయితీ క‌నిపించ‌దు. ఆవిష‌యాన్ని మ‌హేష్ బాగా ప‌సిగ‌ట్టారు. ఇక తార‌క్ 30వ సినిమా అధికారిక పోస్ట‌ర్ రిలీజ్ చేయాల‌ని ఫ్యాన్స్ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అప్ డేట్స్ ఇవ్వ‌డంలో నిజాయితీ క‌నిపించ‌లేద‌ని..ఇన్నాళ్లు ఓపిక ప‌ట్టి ఇప్పుడు ఓపెన్ అవుతున్నామ‌ని తార‌క్ అభిమాను ఒక‌రు ఏంటి ఈ నిర్ల‌క్ష్యం అని ప్ర‌శ్నించారు. మ‌రి వీటిపై మహేష్‌..తార‌క్ ఎలాంటి బ‌ధులిస్తారో చూడాలి.