Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ తో వెళ్లిన మెహ్రీన్

By:  Tupaki Desk   |   26 Jun 2018 6:04 AM GMT
ఫ్యాన్స్ తో వెళ్లిన మెహ్రీన్
X

కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహ్రీన్ పిర్జాద. అమ్మడు వచ్చిన కొత్తలో మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది. వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ఒక ఏడాది పాటు షూటింగ్ లతోనే కెరీర్ ను కొనసాగించింది. సినిమాలు కాస్త ఆలస్యం అయినా మెహ్రీన్ ఏ మాత్రం ఇబ్బంది పడకుండా సినిమా వాళ్ల కష్టాలను అర్ధం చేసుకొని షూటింగ్ లలో పాల్గొంది. ఇకపోతే మెహ్రీన్ కు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురైంది.

అమ్మడు రీసెంట్ గా చెన్నై వెళ్లడానికి ప్లాన్ చేసుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న నోటా తమిళ్ తెలుగులో తెరకెక్కుతోంది. అయితే అర్జెంట్ గా చెన్నై షూటింగ్ కి వెళ్లాలని అనుకుంది. అదే రోజు గోపీచంద్ పంతం ఆడియో రిలీజ్ కారణంగా కొంచెం ఆలస్యం అవుతుందని దర్శకుడు ఆనంద్ కు సమాచారం ఇచ్చింది. అయితే ఆమె వెళ్ళాలి అనుకున్న సమయంలో ఫ్లైట్స్ ఏమి లేకపోవడంతో మెహ్రీన్ ట్రైన్ లో వెళ్లాలని అనుకుంది. అయితే ఆమె బుక్ చేసుకున్న సీట్ లో మద్యం తాగి ఉండడం మెహ్రీన్ కు చాలా ఇబ్బందిగా అనిపించింది.

మెహ్రీన్ తో పాటు ఆమె తల్లి - అసిస్టెంట్ కూడా ఉన్నారు. ఇక లాభం లేదనుకొని ట్రైన్ దిగేసి పంతం దర్శకుడు చక్రవర్తికి కాల్ చేసిందట. ఆయన కారు పంపించడంతో కొంత దూరం వరకు వెళ్లిన మెహ్రీన్ చెన్నై కి సమీపంలో అభిమానుల సహాయంతో మొత్తం 9 గంటల జర్నీతో షూటింగ్ స్పాట్ కి చేరుకుందట. ఈ విషయం గురించి తెలుసుకున్న నోటా యూనిట్ మెహ్రీన్ ను చాలా ప్రశంసించారు. ఇక డైరెక్టర్ ఆనంద్ మరోసారి ఇలా రిస్క్ చేయడం తగదని కొన్ని జాగ్రత్తలు తెలిపినట్లు టాక్.