Begin typing your search above and press return to search.

జూలై రెండో వారంలో ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభం..?

By:  Tupaki Desk   |   1 July 2021 5:30 PM GMT
జూలై రెండో వారంలో ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభం..?
X
'బిగ్ బాస్' షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ''ఎవరు మీలో కోటీశ్వరులు'' అనే రియాలిటీ గేమ్ షో ద్వారా మరోసారి అలరించడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్న తారక్.. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. మరికొన్ని రోజుల్లో షో ప్రసారం అవుతుందని భావిస్తుండగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో గేమ్ షో జరగకపోవచ్చని రూమర్స్ వచ్చాయి. ఇదే క్రమంలో అసలు ఈ షోనే రద్దు చేస్తున్నారని టాక్ వినిపించింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

తాజాగా సమాచారం ప్రకారం ''ఎవరు మీలో కోటీశ్వరులు'' టీవీ షో షూటింగ్ జూలై రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో పాటుగా ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. రామ్ చరణ్ తో కలసి ఒక సాంగ్ షూట్ చేస్తే తారక్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తైపోతుంది. అందుకే టీవీ గేమ్ షో స్టార్ట్ చేయాలని యంగ్ టైగర్ నిర్ణయించుకున్నారట.

ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కోసం స్పెషల్ సెట్ ఏర్పాటు చేశారు. అలానే తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి కంటెస్టెంట్స్ ని కూడా షార్ట్ లిస్ట్ చేసారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో క్కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత టీవీలో టెలికాస్ట్ అయ్యే తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమాని స్టార్ట్ చేయనున్నారు.