Begin typing your search above and press return to search.

ట్రైలర్: అలరిస్తోన్న 'SR క‌ళ్యాణమండ‌పం'

By:  Tupaki Desk   |   28 July 2021 6:07 AM GMT
ట్రైలర్: అలరిస్తోన్న SR క‌ళ్యాణమండ‌పం
X
'రాజావారు రాణిగారు' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం - 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ''SR క‌ళ్యాణమండ‌పం EST.1975''. శ్రీధర్ గాదే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్ర‌మోద్ - రాజు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 6న ఈ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

'పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినవాడు కూడా విలువ ఇవ్వడు' అని సాయి కుమార్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఇన్నాళ్లూ ఇదొక యూత్ కామెడీ ఎంటర్టైనర్ అనుకునేలా ప్రమోషనల్ కంటెంట్ వదిలిన మేకర్స్.. ఈ ట్రైలర్ లో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్స్ ని చూపించారు. ఇందులో కిర‌ణ్ తండ్రిగా సాయి కుమార్ కనిపిస్తున్నారు. ఏదో ఒక ఇన్సిడెంట్స్ వల్ల తండ్రి అంటే పడని వ్యక్తిగా హీరో బిహేవ్ చేస్తున్నాడు. అదే సమయంలో కాలేజీలో హీరోయిన్ ప్రేమ కోసం హీరో పడే పాట్లు కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. చివరకు తండ్రీకొడుకులు ఒకటయ్యారా?, హీరోయిన్ ప్రేమను హీరో సాధించాడా? అనేవి 'SR క‌ళ్యాణమండంపం' సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

'SR క‌ళ్యాణమండంపం' చిత్రానికి హీరో కిర‌ణ్ క‌థ‌ - స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందించ‌డం విశేషం. కిరణ్ నటనలో మొదటి సినిమా కంటే చాలా మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఇందులో తనికెళ్ల భరణి - తులసి - శ్రీకాంత్ అయ్యంగార్ - టీఎన్నార్ - అరుణ్ - అనిల్ - భరత్ - కిట్టయ్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మొత్తం మీద ఫన్ అండ్ ఎమోషన్స్ కలబోసిన ఈ ట్రైలర్ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం సమకూర్చగా.. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత వచ్చే నెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.