Begin typing your search above and press return to search.

'ఎనిమీ' ట్రైలర్: శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ..!

By:  Tupaki Desk   |   23 Oct 2021 1:34 PM GMT
ఎనిమీ ట్రైలర్: శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథ..!
X
కోలీవుడ్ స్టార్ హీరోలు విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. దీపావళి కానుకగా నవంబర్ 4న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ట్రైలర్ లో విశాల్ - ఆర్య ఇద్దరూ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా.. ప్రకాష్ రాజ్ - తంబి రామయ్య వారి తండ్రులుగా కనిపిస్తున్నారు. పోటీ వస్తే మీరిద్దరూ శత్రువులే.. కానీ మిగతా సమయాల్లో మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రకాష్ రాజ్ వాళ్ళకి చెబుతున్నారు. అయితే సింగపూర్ లో ఓ ప్రమాదంలో 11 మంది మరణించగా.. దానికి ఆర్య కారణమని అనుమానించి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విశాల్ ఇందులో పోలీసు పాత్రలో కనిపిస్తున్నారు.

భారీ యాక్షన్ సీక్వెన్సులు - ఛేజింగ్ సన్నివేశాలతో నిండిన ఈ యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆర్‌డి రాజశేఖర్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో విలక్షణ నటుడు మమతా మోహన్ దాస్ - కరుణాకరన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితుల కథే 'ఎనిమీ' సినిమా అని తెలుస్తోంది. స్నేహితులైన విశాల్ - ఆర్య శత్రువులుగా ఎలా మారారు? దీని వెనకున్న అసలు కథేమిటి? అనేది తెలియాలంటే 'ఎనిమీ' సినిమా విడుదలయ్య వరకు ఆగాల్సిందే. ఈ చిత్రానికి ఎస్.ఎస్‌ థమన్ సాంగ్స్ కంపోజ్ చేయగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. రేమాండ్ డేర్రిక్ క్రాస్తా ఎడిటింగ్ వర్క్ చేయగా.. రవి వర్మ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.

మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాడు - వీడు' సినిమా వచ్చిన పదేళ్ల తర్వాత విశాల్ - ఆర్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. 'పెద్దన్న' చిత్రానికి పోటీగా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ''ఎనిమీ'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.