Begin typing your search above and press return to search.

మాయావినే కాదు మ‌హేష్ ని మాయ చేసి బుట్ట‌లో వేశాడు!

By:  Tupaki Desk   |   6 July 2021 4:30 AM GMT
మాయావినే కాదు మ‌హేష్ ని మాయ చేసి బుట్ట‌లో వేశాడు!
X
ఒకే హీరోతో.. ఒకే ద‌ర్శ‌కుడితో బ్యాక్ టు బ్యాక్ ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం ఏ సంగీత ద‌ర్శ‌కుడికి అయ‌నా అదృష్ట‌మే. ప‌ని ప‌రంగా బోలెడంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ‌ర్ స్టాండింగ్ ప‌రంగా స‌మ‌స్య‌లుండ‌వు. అలాంటి చోట ప్ర‌శాంత వాతావ‌రణంలో క్రియేటివిటీ ప‌రంగా నిరూపించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. డిఫ‌రెన్సెస్ కి ఆస్కారం త‌క్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్.థ‌మ‌న్ అలాంటి ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మ‌హేష్‌.. త్రివిక్ర‌మ్ లాంటి టాప్ క్లాస్ తో ప‌ని చేస్తున్నాడు.

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాట‌క థ‌మ‌న్ బాణీలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌లోనే మ‌హేష్ త‌దుప‌రి చిత్రానికి కూడా అతడే సంగీత ద‌ర్శ‌కుడిగా లాక‌య్యారు. ఆస‌క్తిక‌రంగా అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్టిచ్చిన త్రివిక్ర‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అల పాట‌ల్ని చార్ట్ బ‌స్ట‌ర్లుగా నిలిపిన థ‌మ‌న్ వెంట‌నే త్రివిక్ర‌మ్ కి క‌మిటైపోయారు.

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టి నుంచో క‌లిసి మూడ‌వ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నా కానీ ఇన్నాళ్లు కుద‌ర‌లేదు. చివ‌రిగా ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ర‌ద్దు అవ్వ‌డంతో మాట‌ల మాంత్రికుడు మ‌హేష్ ని అనుకోకుండానే లాక్ చేసారు. ఆ త‌ర్వాత వ్య‌వ‌హారమంతా తెలిసినదే. ప్ర‌తిదీ చ‌కచ‌కా జ‌రిగిపోయింది. ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేష‌న్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌డానికి ముందుకొచ్చింది. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపికైన థ‌మ‌న్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

షూటింగ్ ఇంకా ప్రారంభం కాక‌ముందే థ‌మ‌న్ బాణీలు రెడీ చేసేస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు పాట‌లున్న‌ట్లు థ‌మ‌న్ రివీల్ చేసారు. అలాగే సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంద‌ని తెలిపారు. ఇప్ప‌టికే అందులో మూడు పాట‌లు రికార్డింగ్ పూర్త‌యింద‌ని చెప్పి షాకిచ్చారు. అన్ని ట్యూన్లు ఒకే అయిపోయాయ‌ని.. షూటింగ్ కి వెళ్ల‌డ‌మే త‌రువాయి అని థ‌మ‌న్ చెప్పుకొచ్చారు. మొత్తానికి థ‌మ‌న్ సినిమా ప్రారంభానికి ముందే పాటలు రెడీ చేసి అభిమానుల్లో జోష్ ని పెంచారు. థ‌మన్ గ‌తంలో దూకుడు.. బిజినెస్ మెన్ చిత్రాల‌కు సంగీతం అందించిన సంగ‌తి తెలిసిందే. ఆ రెండు చిత్రాలు మ్యూజిక‌ల్ గా మంచి హిట్ అయ్యాయి.

మ‌హేష్ న‌టించిన ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఈ లోపు త్రివిక్ర‌మ్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. మ‌రి మ‌హేష్ కోసం మాట‌ల మాంత్రికుడు ఎలాంటి స్ర్కిప్ట్ సిద్దం చేసార‌న్న‌ది చూడాలి. త్రివిక్ర‌మ్ `అల‌వైకుంఠ‌పుర‌ములో`తో భారీ స‌క్సెస్ అందుకున్న సంగ‌తి తెలిసిందే.