Begin typing your search above and press return to search.

#EMK కు ఐపీఎల్‌ దెబ్బ గట్టిగా పడింది

By:  Tupaki Desk   |   1 Oct 2021 4:30 AM GMT
#EMK కు ఐపీఎల్‌ దెబ్బ గట్టిగా పడింది
X
ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ఎన్టీఆర్‌ చేస్తున్న నేపథ్యంలో జెమిని టీవీ భారీ అంచనాలు పెట్టుకుంది. జెమిని టీవీ రేటింగ్‌ ఖచ్చితంగా అమాంతం పెరుగుతుందని అంతా ఆశించారు. కాని జెమిని వారు ఆశించింది ఏమీ జరగలేదు. మొదటి రెండు ఎపిసోడ్‌ ల్లో రామ్‌ చరణ్‌ కనిపించడం వల్ల ప్రేక్షకులు పెద్ద ఎత్తున చూశారు. ఆ తర్వాత నుండి కాస్త రేటింగ్‌ తగ్గింది. కాని వారం వారం రేటింగ్‌ పెరుగుతూ రావడంతో జెమిని టీవీ రేటింగ్‌ మెరుగు పడుతుందని బుల్లి తెర విశ్లేషకులు భావించారు. మూడు వారాల్లో వరుసగా వారం వారం రేటింగ్ పెరగడంతో మరింతగా రేటింగ్ పెరగుతుందని భావించిన సమయంలో అనూహ్యంగా తాజా వీక్‌ రేటింగ్ తగ్గినట్లుగా సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ మానియా పని చేయడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఐపీఎల్‌ ఎఫెక్ట్ పడిందని అంటున్నారు. ఐపీఎల్‌ ఈ ఏడాది సీజన్‌ బ్యాలన్స్‌ మ్యాచ్ లను యూఏఈలో నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రారంభం అయిన ఈ ఐపీఎల్‌ మ్యాచ్ లకు విపరీతమైన రేటింగ్‌ దక్కుతుందట. యువత ఎవరు మీలో కోటీశ్వరులు చూసేవారు.. ఇప్పుడు వారే ఐపీఎల్‌ ను చూస్తున్నట్లుగా సోషల్‌ మీడియా టాక్ వినిపిస్తుంది. ఐపీఎల్‌ దెబ్బకు బిగ్‌ బాస్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా స్టార్‌ మా వర్గాల ద్వారా కూడా సమాచారం అందుతోంది.

ఎవరు మీలో కోటీశ్వరులు షో పై చాలా నమ్మకం పెట్టుకున్న జెమిని వారికి నిరాశ తప్పలేదు. దాంతో తదుపరి సీజన్ ఉంటుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఐపీఎల్ పూర్తి అయిన తర్వాత అయినా మళ్లీ రేటింగ్‌ పుంజుకుంటుందేమో చూడాలి. ఎన్టీఆర్‌ దసరా ఎపిసోడ్‌ కు గాను మహేష్ బాబు రాబోతున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ ను కూడా తీసుకు వస్తారనే టాక్‌ ఉంది. గెస్ట్ లతో రేటింగ్‌ ను ఎక్కువ తీసుకు వచ్చేలా జెమిని టీవీ వారు ప్లాన్‌ చేస్తున్నారు. మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఐపీఎల్‌ దెబ్బ గట్టిగా పడింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఎన్టీఆర్‌ వల్ల ఈమాత్రం అయినా చూస్తున్నారు... ఆయన లేకుంటే ఖచ్చితంగా ఈ షో ను జనాలు కనీసం పట్టించుకునేవారు కాదు అంటూ నెటిజన్స్ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.