Begin typing your search above and press return to search.

#EMK: మహేష్‌ ల్యాండింగ్ టైమ్‌ అయ్యింది

By:  Tupaki Desk   |   8 Oct 2021 3:40 AM GMT
#EMK: మహేష్‌ ల్యాండింగ్ టైమ్‌ అయ్యింది
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో దసరా స్పెషల్‌ ఎపిసోడ్‌ కు సూపర్ స్టార్‌ మహేష్ బాబు రాబోతున్న విషయం ఇప్పటికే తేలిపోయింది. లీక్ పిక్‌ వల్ల ఆ విషయంపై రెండు వారాల ముందే స్పష్టత వచ్చేసింది. అయితే ఇప్పటి వరకు జెమిని టీవీ వారి నుండి అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఎట్టకేలకు అందుకు సంబంధించిన ప్రకటన రాబోతుంది. నేడో రేపో అన్నట్లుగా జెమిని వారు ప్రోమోను విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. మొత్తం మూడు ప్రోమోలను రెడీ చేశారని.. మహేష్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అయ్యే రోజు వరకు ఆ మూడు ప్రోమోలను టెలికాస్ట్‌ చేస్తారని సమాచారం అందుతోంది.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో కోసం అభిమానులు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. మహేష్‌ బాబు మరియు ఎన్టీఆర్‌ లు మంచి స్నేహితులు అనే విషయం తెల్సిందే. వీరిద్దరితో పాటు రామ్‌ చరణ్ కూడా వీరి మంచి స్నేహితుడు. వీరు ముగ్గురిని పలు సందర్బాల్లో చూడటం జరిగింది. పార్టీల్లో వీరు ముగ్గురు కలుస్తూనే ఉంటారు. కాని ఇలా ఒక షో ద్వారా అది కూడా ఒక గేమ్ షో ద్వారా ఇద్దరు బడా హీరోలను చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మహేష్‌ బాబు ఇలాంటి బుల్లి తెర షో లకు ఆసక్తి చూపించరు. కాని ఎన్టీఆర్‌ తో ఉన్న స్నేహం మరియు ఈ షో పై ఉన్న ఆసక్తి కారణంగా ఆయన వచ్చేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మహేష్‌ బాబు తో ఎన్టీఆర్‌ షో ను ఎలా నడుపుతాడు.. ఇద్దరి మద్య ఎలాంటి విషయాల గురించి చర్చ జరుగుతుంది.. అసలు ఇద్దరు ఏ విధంగా ఇంటరాక్ట్‌ అవుతారు అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఇద్దరు హీరోలు కూడా సూపర్ స్టార్స్ అనడంలో సందేహం లేదు. అలాంటి హీరోలు బుల్లి తెరపై ఒకేసారి కనిపిస్తే రేటింగ్‌ రికార్డ్‌ బద్దలు అవ్వడం ఖాయం అంటూ బుల్లి తెర వర్గాల వారు చెబుతున్నారు. ప్రస్తుతం షో కు సంబంధించినంత వరకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనదైన శైలిలో మంచి హోస్ట్‌ గా పేరు దక్కించుకున్నారు.

రేటింగ్‌ విషయంలో కాస్త నిరుత్సాహం ఉన్నా కూడా ఎన్టీఆర్‌ హోస్టింగ్‌ కు ఎక్కడ కూడా మచ్చ లేదు అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. వారంలో నాలుగు ఎపిసోడ్‌ లుగా టెలికాస్ట్‌ అవుతున్న ఈ షో లో ఇప్పటికే చాలా మంది లక్షల్లో గెలుచుకున్నారు. ఇక సెలబ్రెటీలు ఇప్పటి వరకు రామ్‌ చరణ్‌.. రాజమౌళి.. కొరటాల శివలు వచ్చారు. ఇప్పడు మహేష్ బాబు కూడా రాబోతున్నాడు. అందుకు సంబంధించిన ప్రోమోతోనే షో పై అంచనాలు ఆకాశానికి పెంచేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇద్దరి మద్య ఆట కోసం మాత్రమే కాకుండా ఇద్దరి మద్య ఎలాంటి స్నేహం ఉంది.. ఇద్దరు కుటుంబ విషయాలను ఎలా చర్చించుకుంటారు అనే విషయాలు అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అవన్నీ కూడా ప్రోమోలో చూపుతారనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఇక ఇద్దరు కూడా బడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను చేశాడు. ఆ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది. మహేష్‌ బాబు సర్కారు వారి పాట కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రెండు సినిమాలు కూడా కేవలం వారం గ్యాప్‌ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. ఇంతే కాకుండా వరుసగా భారీ సినిమాలను ఈ ఇద్దరు హీరోలు చేసేందుకు కమిట్ అయ్యి ఉన్నారు. ముందు ముందు ఈ ఇద్దరు హీరోల కాంబోలో మల్టీ స్టారర్‌ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ విషయమై ప్రోమోలో ఏమైనా క్లారిటీ ఇచ్చేనా చూడాలి.