Begin typing your search above and press return to search.

#EMK : కోటి గెలుచుకున్నది పబ్లిసిటీ స్టంట్ కాదు కదా!

By:  Tupaki Desk   |   7 Oct 2021 10:30 AM GMT
#EMK : కోటి గెలుచుకున్నది పబ్లిసిటీ స్టంట్ కాదు కదా!
X
కౌన్ బనేగా కరోడ్ పతి షో చాలా సీజన్ లుగా నడుస్తోంది. పలువురు అందులో కోటి రూపాయలు గెలుచుకున్నారు. కాని తెలుగులో అదే షో మా లో మూడు నాలుగు సీజన్ లు టెలికాస్ట్‌ అయ్యింది.. ఇప్పడు ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా కూడా జెమిని టీవీలో టెలికాస్ట్‌ అవుతోంది. ఇప్పటి వరకు ఎవరు కూడా కోటి రూపాయలు గెలుచుకున్న సందర్బాలు లేవు. కాని త్వరలో టెలికాస్ట్‌ కాబోతున్న ఎపిసోడ్‌ లో పాల్గొన్న కంటెస్టెంట్‌ మాత్రం ఏకంగా కోటి రూపాయల ప్రశ్నను చూశాడు.. దానికి సమాధానం కూడా చెప్పాడు అంటూ జెమిని వర్గాల వారు చెబుతున్నట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఉన్నట్లుండి ఒక్కసారిగా షో గురించి చర్చ మొదలు అయ్యింది. ఆ ఎపిసోడ్‌ ఎప్పుడెప్పుడు టెలికాస్ట్‌ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఆ ట్యాలెంటెడ్‌ వ్యక్తి ఎవరై ఉంటారు.. కోటి రూపాయలు అతడు గెలుచుకున్న సమయంలో ఎన్టీఆర్‌ ఫీలింగ్ ఏంటీ.. ఇంతకు ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటీ అనేది అంతా ఆసక్తిగా ఉంటున్నారు.

ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఆశించిన స్థాయిలో రేటింగ్‌ రావడం లేదు. మొదటి రెండు కర్టన్ రైజ్ ఎపిసోడ్స్ కు భారీగా రేటింగ్‌ దక్కింది. ఆ తర్వాత రెండు మూడు వారాల పాటు రేటింగ్‌ బాగానే వచ్చినా గడచిన రెండు వారాలుగా రేటింగ్ దారుణంగా ఉంది అనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్‌. రేటింగ్‌ ను పెంచేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా జనాలు షో ను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఈ సమయంలో కోటి రూపాయలు గెలుచుకున్నాడు అంటూ వస్తున్న వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాంతో ఒక్కసారిగా జనాల్లో షో గురించి చర్చ మొదలు అయ్యి రేటింగ్‌ కూడా పెరిగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉన్నట్లుండి షో రేటింగ్‌ పెరిగిన నేపథ్యంలో కోటిరూపాయలు గెలుచుకున్నది పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉంటుందా అనేది కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించి ప్రచారం జరగాలనే ఉద్దేశ్యంతో జెమిని వర్గాల వారు ఈ విషయాన్ని లీక్ చేసి ఉంటారు అనేది కొందరి అభిప్రాయం అయితే కొందరు మాత్రం కంటెస్టెంట్‌ కోటి రూపాయలు గెలుచుకున్న విషయం కూడా అనుమానంగానే ఉందని.. అది కూడా పబ్లిసిటీ స్టంట్ అయ్యి ఉండక పోతుందా అంటూ కొందరు డౌటానుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏం అయితేనేం అనూహ్యంగా ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు షో గురించి జనాలు చర్చించుకోవడం జరుగుతుంది.. అదే సమయంలో వ్యూవర్ షిప్ కూడా అనూహ్యంగా పెరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షో గురించిన కోటి గెలుచుకున్న విషయం కనుక నిజం అయితే ఖచ్చితంగా షో కు మంచి రేటింగ్‌ రావడం ఖాయం అంటున్నారు.