Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ విచార‌ణ‌.. ఈడీ ముందుకు న‌వ‌దీప్!

By:  Tupaki Desk   |   12 Sep 2021 4:41 PM GMT
డ్ర‌గ్స్ విచార‌ణ‌.. ఈడీ ముందుకు న‌వ‌దీప్!
X
టాలీవుడ్ ని డ్ర‌గ్స్ విచారణ షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇ్ప‌టికే ప‌లువురు టాప్ సెల‌బ్రిటీల‌ను ఈ కేసులో ఈడీ విచారించింది. పూరి జ‌గ‌న్నాథ్- ర‌కుల్ ప్రీత్ - ఛార్మి-ర‌వితేజ ల‌ను డ్ర‌గ్స్ కేసులో విచారించారు. ఇప్పుడు న‌వ‌దీప్ వంతు.

ఈ సోమ‌వారం గ‌చ్చిబౌళి బీపీఎం (బిట్స్ ప‌ర్ మినిట్) ప‌బ్ నిర్వాహ‌కుడు కం న‌టుడు న‌వ‌దీప్ ని విచారించేందుకు ఈడీ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇంత‌కుముందు పై సెల‌బ్రిటీల‌తో పాటు న‌వ‌దీప్ ని సిట్ ద‌ర్యాప్తు చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి మ‌నీ ల్యాండ‌రింగ్ కోణంలో ఈడీ విచారిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్కొక్క‌రిని ఏడెనిమిది గంట‌ల పాటు ఈడీ విచారించింది. డ్ర‌గ్స్ మ‌నీల్యాండ‌రింగ్ వ్య‌వ‌హారాల‌పై ప్ర‌శ్న‌ల‌ను సంధించింది. ఈ కేసులో విదేశీ కెల్విన్ తో లావాదేవీల‌పైనా ఆరాలు తీసింది. రేపు న‌వ‌దీప్ ఇలాంటి ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ లావాదేవీల‌ను ఈడీకి వెల్ల‌డించాల్సి ఉంటుంది.