Begin typing your search above and press return to search.

సూపర్ హిట్ మూవీ పార్ట్‌ 3 ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ ఇచ్చిన నిర్మాత

By:  Tupaki Desk   |   28 Aug 2022 6:30 AM GMT
సూపర్ హిట్ మూవీ పార్ట్‌ 3 ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ ఇచ్చిన నిర్మాత
X
ఒక సినిమా సూపర్‌ హిట్ అయ్యింది అంటే పార్ట్‌ 2 రావడం చాలా కామన్ విషయం. దృశ్యం మలయాళంలో ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దృశ్యం కు ఆ మధ్య సీక్వెల్‌ వచ్చింది. దృశ్యం 2 కరోనా పరిస్థితుల కారణంగా అమెజాన్ ప్రైమ్‌ ద్వారా నేరుగా ఓటీటీ లో విడుదల అయ్యింది.

దృశ్యం 2 ను థియేటర్ లో చూడలేక పోయాం అంటూ ప్రేక్షకులు ఇప్పటికి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలయాళం లోనే కాకుండా తెలుగు దృశ్యం 2 ను కూడా ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఇప్పుడు మరో సీక్వెల్‌ రాబోతుంది. దృశ్యం 3 కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చి దృశ్యం ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపిన విషయం తెల్సిందే.

ఇప్పుడు దృశ్యం 3 గురించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ ను నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందని.. త్వరలోనే సినిమా నుండి ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా ఒక అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పడంతో మలయాళం సినీ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు కూడా దృశ్యం 3 పై ఆసక్తి పెంచుకుంటున్నారు.

మలయాళం దృశ్యం 3 విడుదల అయ్యి మంచి టాక్ దక్కించుకుంటే వెంటనే వెంకటేష్ కూడా దృశ్యం 3 ని రీమేక్ చేసేందుకు సిద్ధం అయ్యే అవకాశం ఉంది. దృశ్యం 2 ను తెలుగు లో ఒరిజినల్‌ దర్శకుడు జీతు జోసెఫ్‌ తెరకెక్కించిన విషయం తెల్సిందే. కనుక తెలుగు దృశ్యం 3 కి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందని.. ఆయనే దర్శకత్వం వహిస్తాడని సినీ ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు.