Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యంగ్ హీరోకు పోలీసుల నోటీసులు?

By:  Tupaki Desk   |   13 March 2021 4:36 AM GMT
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యంగ్ హీరోకు పోలీసుల నోటీసులు?
X
టాలీవుడ్ ను గతంలోనే డ్రగ్స్ కేసు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇందులో చాలా మంది దర్శకులు, సినీ ప్రముఖులు ఇన్ వాల్వ్ అయినట్టు పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. కానీ ఇప్పుడా కేసు అతీగతీ లేకుండా పోయింది.

అయితే కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసుల్లో బాలీవుడ్, శాండల్ వుడ్ నటులు పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో కు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారన్న వార్త వైరల్ అయ్యింది. ఓ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ హీరోను ఈరోజు విచారణకు రావాలని ఆదేశించినట్టు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కన్నడ మీడియాలో ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ హీరోతోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత తదితరులు ఉన్నట్టు పోలీసులు అధికారులు తెలిపినట్లు ప్రచారం సాగుతోంది.

ఈ డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించినట్టు తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మస్తాన్, విక్కీ మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి. ముస్తాన్ ను విచారించగా టాలీవుడ్ సినీ నిర్మాత పేరు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ఈ పార్టీలకు ప్రముఖులు హాజరయ్యారని పోలీసులు తెలిపారు.

ఈ టాలీవుడ్ హీరో 2017 జులైలో జరిగిన డ్రగ్స్ కేసులో కూడా హైదరాబాద్ సిట్ పోలీసుల ముందు హాజరవ్వడం విశేషం. అయితే ఈ కేసు విషయంలో పోలీసుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఆ హీరో, నిర్మాతలు ఎవరనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.