Begin typing your search above and press return to search.

నోటీసులు అందినోళ్లకు డెడ్ లైన్ ఇదే

By:  Tupaki Desk   |   14 July 2017 3:32 AM GMT
నోటీసులు అందినోళ్లకు డెడ్ లైన్ ఇదే
X
డ్రగ్ రాకెట్ లో అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇరుక్కున్నారనే న్యూస్ ఇప్పటికే హల్ చల్ చేస్తోంది. ఆయా వ్యక్తుల పేర్లు బయటకు రాకపోయినా.. వారికి సంబంధించిన వివరాలతో మీడియా హింట్స్ అందిస్తుండడంతో.. చాలా పేర్లు ఇప్పటికే జనాలకు తెలిసిపోయాయి. మొదట 10 మందికి నోటీసులు జారీ చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్.. గురువారం నాడు మరో 6 గురికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు టాప్ నటీనటులు కూడా ఉన్నారట.

తెలంగాణకు చెందకపోయినా.. తరచుగా హైద్రాబాద్ వచ్చే ఓ హీరోయిన్ డ్రగ్స్ కోసమే ఇక్కడకు వస్తుందట. అలాగే హైద్రాబాద్ కు చెందిన ఓ డైరెక్టర్.. పలుమార్లు చెన్నై వెళ్లేందుకు కారణం కూడా ఇదే అని తెలుస్తోంది. మొత్తం 16 మందికి నోటీసులు అందగా.. వీరంతా జూలై 19న సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. డ్రగ్ రాకెట్ సూత్రధారి అయిన కెల్విన్ మస్కరెన్హాస్ తో.. ఈ 16 మంది తరచుగా టచ్ గా ఉండేవారట. కొంతమంది అప్పుడప్పుడు కాంటాక్ట్ లోకి వస్తే.. కొంతమంది మాత్రం రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

అయితే.. నోటీసులు అందుకున్నంత మాత్రాన ఈ 16 మంది నిందితులు అని చెప్పలేమని అధికారులు అంటున్నారు. అందరినీ విచారించిన తర్వాతే.. ఎవరు నేరస్థులు.. ఎవరు డ్రగ్స్ వినియోగించేవారు.. ఎవరెవరు డ్రగ్స్ సరఫరాకు సాయం చేశారనే విషయంపై క్లారిటీ వస్తుందని.. ఆ తర్వాతే వారి పేర్లను బయటపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. జూలై 19న నోటీసులు అందుకున్న అందరినీ రహస్య ప్రాంతంలో విచారించనున్నారు సిట్ అధికారులు.