Begin typing your search above and press return to search.

#దృశ్యం 2.. కృతిక‌నే కావాల‌ని సూచించిన వెంకీ

By:  Tupaki Desk   |   18 March 2021 2:30 AM GMT
#దృశ్యం 2.. కృతిక‌నే కావాల‌ని సూచించిన వెంకీ
X
మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `దృశ్యం 2` తెలుగులో వెంకీ క‌థానాయ‌కుడిగా రీమేక‌వుతున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `దృశ్యం`కి సీక్వెల్ మూవీ ఇది. తొలి భాగంలో న‌టించిన వారంతా పార్ట్ 2లోనూ భాగ‌మ‌య్యారు.

వెంకీ స‌తీమ‌ణిగా మీనా న‌టిస్తుండ‌గా.. కూతుళ్ల పాత్ర‌లు య‌థావిధిగా తెర‌పై క‌నిపిస్తాయి. దృశ్యం 2 షూటింగ్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. మొత్తం పాత టీమ్ తోనే షూటింగ్ చేస్తుండ‌డంతో వెంకీ జోష్ తో ప‌ని చేస్తున్నార‌ట‌.

అయితే సీక్వెల్లోనూ కీ పాయింట్ గా ఉండే పాత్ర కృతిక‌ది. అందుకే పార్ట్ 1లో న‌టించిన‌ కృతిక‌నే తీసుకున్నారు. నిజానికి ఈ పాత్ర‌ని మార్చేదామ‌ని ద‌ర్శ‌కుడు జీతు జోసేఫ్ అనుకున్న‌ప్ప‌టికీ వెంకీ మొద‌టి పార్ట్ లో ఉన్న‌వారంద‌రినీ తీసుకోవాల‌ని సూచించార‌ట‌. దాంతో జీతో త‌న ఆలోచ‌న మార్చుకుని కృతిక‌ను తిరిగి టీమ్ లో తీసుకున్నార‌ని తెలుస్తోంది. దృశ్యం స‌క్సెస‌య్యాక దిల్ రాజు స‌హా ప‌లువురు కృతిక‌కు ఆఫ‌ర్లు ఇచ్చారు. కానీ కొన్ని టేకాఫ్ అవ్వ‌క‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ దృశ్యం 2 టీమ్ తో చేరింది.