Begin typing your search above and press return to search.

మహాసముద్రంలోనూ హీరోయిన్‌ ట్విస్ట్‌ ఇస్తుందా?

By:  Tupaki Desk   |   27 Sep 2021 3:30 AM GMT
మహాసముద్రంలోనూ హీరోయిన్‌ ట్విస్ట్‌ ఇస్తుందా?
X
శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మహాసముద్రం విడుదలకు సిద్దం అవుతోంది. మహాసముద్రం సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సినిమాపై ఇన్ని రోజులు ఉన్న అంచనాలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగాయి. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి నుండి వస్తున్న సినిమా ఇదే అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు అజయ్ భూపతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్‌ తో రూపొందించడం జరిగింది. శర్వానంద్‌ తో పాటు ఈ సినిమా లో సిద్దార్థ్‌ కూడా నటించడం వల్ల సినిమా రేంజ్ మరింత పెరిగినట్లయ్యింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది అంచనాలు పెరిగి పోతున్నాయి. తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయం పై ఆసక్తికర చర్చ మొదలు అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌ బ్లోయింగ్ అన్నట్లుగా ఉంటుందట. ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్‌ మొదట్లో పాజిటివ్ గా అనిపించినా కూడా చివర్లో మాత్రం నెగటివ్‌ షేడ్స్ ఉన్న అమ్మాయిగా కనిపించింది. హీరోను తన శారీరక సుఖం కోసం ఉపయోగించుకుని అతడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆమె మోసం తో సినిమా అనూహ్యంగా మలుపు తిరుగుతుంది. సినిమాలో ఆమె పాత్ర కు జనాలు ఫిదా అయ్యారు. ఇలాంటి హీరోయిన్ ను ఇంతకు ముందు చూడలేదు అన్నట్లుగా దర్శకుడు అజయ్‌ భూపతి స్క్రీన్‌ ప్లేను అంతా కూడా ప్రశంసించారు. సినిమాలో హీరోయిన్ పాత్ర ను చూపించిన తీరును అంతా కూడా అభినందించారు.

ఇప్పుడు మహాసముద్రంలో కూడా అలాగే హీరోయిన్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అదితి రావు నటించిన విషయం తెల్సిందే. నటిగా ఆమె మంచి ప్రతిభావంతురాలు అనడంలో సందేహం లేదు. అందుకే ఆమెను ఈ సినిమాలో చాలా స్పెషల్‌ గా చూస్తామని చెబుతున్నారు. మహాసముద్రంలో హీరోయిన్‌ నెగటివ్‌ షేడ్స్ ఉంటుందా లేదా మరేదైనా తరహాలో ఉంటుందో తెలియదు కాని ఆమె పాత్ర ట్విస్ట్ మాత్రం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మహాసముద్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని.. శర్వానంద్ కు ఈ చాలా కాలం తర్వాత ఈ సినిమా కమర్షియల్‌ విజయాన్ని అందించబోతుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. శర్వానంద్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.