Begin typing your search above and press return to search.

పుష్ప‌రాజ్ లేకుండానే హంగామా షురూ!

By:  Tupaki Desk   |   10 Nov 2022 11:34 AM GMT
పుష్ప‌రాజ్ లేకుండానే హంగామా షురూ!
X
'పుష్ప ది రైజ్‌'తో దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించాడో అంద‌రికి తెలిసిందే. తొలి సారి త‌న పంథాకు పూర్తి భిన్నంగా ఊర‌మాస్ పాత్ర‌లో కూలోడిగా న‌టించి పాన్ ఇండియా వైడ్ గా వున్న ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు బ‌న్నీ. కొత్త త‌ర‌హా పాత్ర‌లో విభిన్న‌మైన మేన‌రిజ‌మ్స్ తో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో క‌లిసి చేసిన పాన్ ఇండియా వండ‌ర్ 'పుష్ప‌'. వ‌రల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీకి సీక్వెల్ గా 'పుష్ప 2' రూపొంద‌నున్న విష‌యం తెలిసిందే.

కొన్ని నెల‌ల క్రితం లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్ లో సైలెంట్ గా మొద‌లైపోయింది. అయితే హీరో అల్లు అర్జున్ లేకుండానే రెగ్యుల‌ర్ షూటింగ్ ని హైద‌రాబాద్ లో మొద‌లు పెట్టేశారు. బ‌న్నీ ఫ్యామిలీతో క‌లిసి త‌న ఫ్రెండ్ వివాహంలో హాజ‌రు కావ‌డానికి ద‌క్షిణాఫ్రికా వెళ్లాడు. తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నాక అల్లు అర్జున్ సెట్స్ లోకి అడుగుపెట్ట‌నున్నాడ‌ట‌.

గురువారం ఈ మూవీని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా వేసిన సెట్ లో మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. బ‌న్నీతో సంబంధంలేని కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఆ త‌రువాత బన్నీ వ‌చ్చాక మ‌రిన్ని కీల‌క సీన్ ల‌ని పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది. హైద‌రాబాద్ షెడ్యూల్ త‌రువాత థాయ్ లాండ్‌, చైనా లోని డీప్ ఫారెస్ట్ లో అల్లు అర్జున్ పాల్గొన‌గా ప‌లు కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ని చిత్రీక‌స్తార‌ట‌.

ఇక థాయ్ లాండ్ లో 15 రోజుల పాటు కీల‌క ఫైట్ సీక్వెన్స్ ని చిత్రీకరించాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే బ‌న్నీపై లుక్ టెస్ట్ ని పూర్తి చేసిన చిత్ర బృందం త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టుగా తెలుస్తోంది.

'పుష్ప‌' సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో పార్ట్ 2 పై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో పార్ట్ 2ని భారీ స్థాయిలో ఊహ‌కంద‌ని విధంగా తెర‌పైకి తీసుకురానున్నార‌ట‌.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్‌, సునీల్‌, అన‌సూయ‌, క‌న్న‌డ న‌టుడు ధ‌నుంజ‌య త‌దిత‌రులు న‌టించ‌నున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. బ‌న్నీ చెప్పిన‌ట్టుగా పార్ట్ 2 ఏ విష‌యంలోనూ అస‌లు త‌గ్గేదేలే అనే స్థాయిలో వుంటుంద‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.