Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : 'రాధేశ్యామ్‌' ఆన్‌ లొకేషన్‌

By:  Tupaki Desk   |   14 Oct 2020 5:35 PM GMT
ఫొటోటాక్‌ : రాధేశ్యామ్‌ ఆన్‌ లొకేషన్‌
X
ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ ప్రారంభం అయ్యింది. లాక్ డౌన్‌ కు ముందు విదేశాల్లో షూటింగ్‌ జరుపుకుంటున్న చిత్ర యూనిట్‌ సభ్యులు కరోనా భయంతో అర్థాంతరంగా షూటింగ్‌ ను క్యాన్సిల్‌ చేసుకుని వచ్చేశారు. షూటింగ్‌ మళ్లీ పునః ప్రారంభించేందుకు గత నెల నుండి ఏర్పాట్లు జరిగాయి. ఎట్టకేలకు ఇటీలీ వీసా రావడంతో యూనిట్‌ సభ్యులు అంతా కూడా అక్కడకు వెళ్లి పోయారు.

కరోనా నిబంధనల అనుసారం దాదాపు పది రోజుల పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా అక్కడ క్వారంటైన్‌ లో ఉన్నారు. ఆ తర్వాత షూటింగ్‌ ను మొదలు పెట్టారు. షూటింగ్‌ మొదలు అయ్యింది అంటూ దర్శకుడు రాధాకృష్ణ ఈ ఫొటోను షేర్‌ చేశాడు. అక్కడ చిత్ర షూటింగ్‌ కు సహకరించే వారితో పాటు చిత్ర ప్రొడక్షన్‌ మరియు డైరెక్షన్‌ టీమ్‌ తో దర్శకుడు తీసుకున్న ఈ సెల్ఫీని ట్వీట్‌ చేశాడు. ఈ నెలలో ప్రభాస్‌ పుట్టిన రోజు ఉంది. అప్పటి వరకు అక్కడే ఉంటారా లేదంటే వచ్చేస్తారా అనేది చూడాలి. ఇటీవల ఈ సినిమా హీరోయిన్‌ పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్బంగా ఆమె లుక్‌ ను రివీల్‌ చేశారు. సినిమాలో ఆమె విభిన్నంగా కనిపించబోతుందని పోస్టర్‌ చూస్తే అనిపిస్తుంది.