Begin typing your search above and press return to search.

అటు పూరినీ.. ఇటు విజయ్ ని కదిలించింది మనమే!

By:  Tupaki Desk   |   11 May 2022 12:30 PM GMT
అటు పూరినీ.. ఇటు విజయ్ ని కదిలించింది మనమే!
X
పరశురామ్ కొంతకాలం పాటు పూరి దగ్గర డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేశాడు. అందువలన పరశురామ్ సినిమాల్లోని హీరోల దగ్గర కూడా మాస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే మహేశ్ బాబు కూడా ఈ సినిమా చేస్తుంటే 'పోకిరి' రోజులు గుర్తుకు వచ్చాయని చెప్పాడు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రెస్ మీట్ లో పరశురామ్ మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

" మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ ను చూసిన వాళ్లంతా ఆయన 'పోకిరి' తరహాలో కనిపిస్తున్నాడని అంటున్నారు. పూరి మా గురువుగారు అనే విషయం అందరికీ తెలిసిందే కదా. పూరి అంటేనే ఒక బ్యూటీ ఫుల్ సోల్ .. ఆయనది వేరే లెవెల్ అంతే. నా సినిమాకి సంబంధించి ఏ అప్ డేట్ బయటికి వచ్చినా ఆయన నుంచి కాల్ వస్తుంది. నిన్న రాత్రి కూడా కాల్ చేసి .. ఈ సినిమా సక్సెస్ తనకి కనిపిస్తుందని అన్నారు. పూరి - మహేశ్ బాబుగారిది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వాళ్ల కాంబినేషన్ మళ్లీ సెట్ అయితే మనకే గదా హ్యాపీ.

అయితే ఆ టైమ్ కి ఆయన ఖాళీ ఉండాలి .. అదే టైమ్ కి ఈయన ఖాళీ ఉండాలి .. అప్పుడే కథా ఒక ప్రాజెక్టు సెట్ అవుతుంది. విజయ్ దేవరకొండతో నేను 'గీత గోవిందం' చేసేటప్పుడు పూరిగారిని చాలాసార్లు కలిశాను.

విజయ్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుందని పూరితో చాలా సార్లు చెప్పాను. అన్నయ్యా మీ ఇద్దరి కాంబినేషన్ చాలా బాగుంటుందన్నయ్యా అని పదే పదే చెప్పేవాడిని. అదే సమయంలో ఇటు విజయ్ తో కూడా చేసేలా సార్లు చెప్పాను. పూరి నుంచి ఆఫర్ వస్తే వదులుకోవద్దని అన్నాను.

ఆ తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్ కుదిరింది .. ఇద్దరి మధ్య ఒక అవగాహన ఏర్పడింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నారు. అందుకు కారణమైనందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది.

ఇక నా నెక్స్ట్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, 14 రీల్స్ బ్యానర్ పై నాగచైతన్య హీరోగా ఒక సినిమా చేయనున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక నెల బ్రేక్ తీసుకున్న తరువాత చైతూ సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళతాము" అని చెప్పుకొచ్చాడు.