Begin typing your search above and press return to search.

బిగ్‌ బ్రేకింగ్‌ : పరశురామ్‌ డైరక్షన్‌ లో మహేష్‌27

By:  Tupaki Desk   |   23 Feb 2020 4:45 AM GMT
బిగ్‌ బ్రేకింగ్‌ : పరశురామ్‌ డైరక్షన్‌ లో మహేష్‌27
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇక మహేష్‌ 27వ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా క్లారిటీ ఇవ్వకున్నా అది నిజమే అన్నట్లుగా లీక్స్‌ వచ్చాయి. దిల్‌ రాజు నిర్మించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని నిన్నటి నుండి మహేష్‌ బాబు 27వ చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించడం లేదు అంటూ కొత్త వార్తలు వస్తున్నాయి.

మహేష్‌ 27వ చిత్రంను ‘గీత గోవిందం’ ఫేం పరుశురామ్‌ దర్శకత్వంలో చేయబోతున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ వారు నిర్మించబోతున్నారట. మార్చిలోనే ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. చాలా స్పీడ్‌ గా ఈ సినిమాను పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేయబోతున్నట్లుగా కూడా ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. గీత గోవిందం విడుదలైన వెంటనే మహేష్‌ బాబుతో సినిమాకు పరుశురామ్‌ ప్రయత్నించిన విషయం తెల్సిందే.

ఆ సమయంలో మహేష్‌ బాబు ఓకే అన్నట్లుగా అన్నా కూడా ఎప్పుడు చేసేది క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇటీవలే నాగచైతన్యతో పరుశురామ్‌ ‘నాగేశ్వరరావు’ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. చైతూతో సినిమా కంటే ముందు మహేష్‌ బాబు 27వ చిత్రాన్ని పరుశురామ్‌ చేయబోతున్నట్లుగా ఇప్పుడు సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ నుండి ఈ సినిమా ప్రకటన రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.