Begin typing your search above and press return to search.

ఆ రీమేక్ మూవీ డైరెక్టర్ ఓకే అయినట్లేనా..?

By:  Tupaki Desk   |   16 April 2020 4:38 PM GMT
ఆ రీమేక్ మూవీ డైరెక్టర్ ఓకే అయినట్లేనా..?
X
ఇటీవలే మలయాళంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సినిమా "అయ్యప్పనుమ్ కోషియం". ఈ సినిమాలో బిజూ మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక హవాల్దారుకి, ఒక పోలీస్ ఆఫీసర్ ల మధ్య రగిలిన బలమైన ఇగోల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. అంతటి బలమైన పాత్ర చిత్రణతో తెరకెక్కించారు డైరెక్టర్ సాచి. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం సౌత్ ఇండియన్ నిర్మాతలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

చివరిగా ఈ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్‌, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లపై తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ పాత్ర కోసం హీరో రానాని ఓకే చేశారు. ఇక మరో కీలక పాత్రకోసం బాలకృష్ణను తీసుకోవాలనుకున్నారు. కానీ బాలకృష్ణ ఆ పాత్ర చేసేందుకు ముందుకు రాకపోవటంతో ఆ పాత్రకోసం రవితేజతో సంప్రదింపులు జరుపుతున్నారట. మాస్ రాజా రవితేజ కూడా ఆ పాత్ర చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి నిర్మాతలు ఇద్దరు డైరెక్టర్ల పేర్లు పరిశీలిస్తున్నారట. ఒకరు సుధీర్‌ వర్మ, మరొకరు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరిని అనుకుంటున్నారట. కానీ గౌతమ్ ప్రస్తుతం జెర్సీని హిందీలో తెరకెక్కించాడానికి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడట. కాబట్టి ఈ సినిమాకు సుధీర్ వర్మను ఓకే చేస్తారని టాక్. లాక్‌ డౌన్‌ పూర్తయిన వెంటనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. అధికారిక ప్రకటన రాలేదు కానీ తదుపరి సమాచారం కోసం కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..