Begin typing your search above and press return to search.

మారుతిని బుక్‌ చేశాడట..!

By:  Tupaki Desk   |   13 Sep 2018 7:35 AM GMT
మారుతిని బుక్‌ చేశాడట..!
X
చిన్న చిత్రాల దర్శకుడిగా పరిచయం అయిన మారుతి ఒక్కో సినిమా సక్సెస్‌ తో స్టార్‌ హీరోల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నానితో ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం చేసి సక్సెస్‌ దక్కించుకున్న సమయంలో అఖిల్‌ తో ‘మహానుభావుడు’ చిత్రం చేయాలని మారుతి ప్రయత్నించాడని - కాని ఆ సమయంలో నాగార్జున సాహసం చేయాలనుకోలేదంటూ వార్తలు వచ్చాయి. దాంతో మహానుభావుడు చిత్రం కాస్త శర్వానంద్‌ కు దక్కింది. మహానుభావుడు చిత్రం తర్వాత మారుతి తెరకెక్కించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా చిత్రాన్ని మారుతి తెరకెక్కించడం జరిగింది.

నాగచైతన్య ప్రతి సినిమా సెన్సార్‌ కు ముందు నాగార్జున చూడటం కామన్‌ అని - ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఎడిటింగ్‌ రూమ్‌ లో నాగార్జున చెప్పేస్తాడు అంటూ టాక్‌ ఉంది. తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని చూసిన నాగార్జున మారుతి వర్క్‌ కు ఫిదా అయ్యాడట. శైలజా రెడ్డి అల్లుడు సినిమాపై నాగార్జున పూర్తి నమ్మకంగా ఉన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. శైలజా రెడ్డి అల్లుడు చూసిన వెంటనే తన బ్యానర్‌ లో ఒక చిత్రం చేయాల్సిందిగా మారుతిని నాగార్జున అడిగినట్లుగా సమాచారం అందుతుంది.

అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా చేయాల్సిందిగా నాగార్జున నుండి మారుతికి అడ్వాన్స్‌ కూడా అందినట్లుగా సమాచారం అందుతుంది. అయితే మారుతి వరుసగా పలు చిత్రాలను కమిట్‌ అయ్యి ఉన్న కారణంగా 2020 వరకు ఖాళీ లేడు అంటూ సమాచారం అందుతుంది. అక్కినేని వారితో మళ్లీ మారుతి సినిమా 2020లో ఉంటుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతానికి మారుతి వద్ద కథ సిద్దంగా లేదు. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేసి కథతో నాగార్జునను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మారుతి దర్శకత్వంలో అఖిల్‌ మూవీ ఉంటుందా లేదంటే నాగార్జున మూవీ ఉంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.