Begin typing your search above and press return to search.

ఇప్ప‌డు తీస్తే చంపేస్తారేమో..కృష్ణ‌వంశీ సంచ‌ల‌నం

By:  Tupaki Desk   |   8 July 2022 9:32 AM GMT
ఇప్ప‌డు తీస్తే చంపేస్తారేమో..కృష్ణ‌వంశీ సంచ‌ల‌నం
X
స్టార్ డైరెక్ట‌ర్ గా, క్రియేట‌ర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు కృష్ణ‌వంశీ. గ‌త మూడేళ్లుగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ లుగా నిలుస్తుండ‌టంతో కావాల‌నే గ్యాప్ తీసుకున్నార‌ట‌. అంతే కాకుండా స‌క్సెస్ లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా త‌న‌కు గ్యాప్ వ‌చ్చింద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం మ‌రాఠీ మూవీ 'న‌ట‌సామ్రాట్‌' ఆధారంగా తెలుగులో 'రంగ‌మార్తాండ‌'ని రీమేక్ చేస్తున్నారు.

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, బ్ర‌హ్మానందం, ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించిన కృష్ణ‌వంవీ టైటిల్ లోగోని విడుద‌ల చేయ‌బోతున్నామ‌ని గురువారం ఓ ప్ర‌త్యేక వీడియోని, ఓ పోస్టర్ ని విడుద‌ల చేశారు. ఇదిలా వుంటే కృష్ణ‌వంశీ ఓ నెటిజ‌న్ కు ఇచ్చిన రిప్లై ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది. ఉన్న‌ట్టుండి కృష్ణ‌వంశీ ఇలా అన్నారేంట‌ని అంతా ఆరా తీస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

గ‌త కొంత కాలంగా ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటున్నారు. చాలా మంది అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూల్ గా స‌మాధానాలు చెబుతున్నారు. నిత్యం ఇలాంటి పోస్ట్ లు పెడుతూ ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో వుంటున్నారు.

అయితే తాజాగా ఓ నెటిజ‌న్ అడిగిన ప్ర‌శ్న‌కు కృష్ణ‌వంశీ చెప్పిన స‌మాధానం ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ లో ఓ అభిమాని మీ నుంచి 'ఖ‌డ్గం' లాంటి మూవీ కోసం ఎదురుచూస్తున్నాం' అంటూ ట్వీట్ చేశాడు. దీనికి 'ఇప్ప‌డుడైతే చంపేస్తారేమో సార్‌' అంటే కృష్ణ వంశీ స‌మాధానం చెప్ప‌డం వైర‌ల్ గా మారింది.

2002లో కృష్ణ‌వంశీ రూపొందించిన చిత్రం 'ఖ‌డ్గం', శ్రీ‌కాంత్, ర‌వితేజ‌, ప్ర‌కాష్‌రాజ్‌, సొనాలి బింద్రే, సంగీత, కిమ్ శ‌ర్మ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. దేశ భ‌క్తి, తీవ్ర వాదం నేప‌థ్యంలో రూపొందించిన ఈ మూవీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ వ‌ర్గం వారిని తీవ్ర‌వాదులుగా చూపించార‌ని అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేగింది. దీంతో కృష్ణ‌వంశీ కొన్ని రోజుల పాటు సైలెంట్ గా వున్నార‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆయ‌న‌ని కొంత మంది ఈ విష‌యంలో కొంత మంది బెదిరించార‌ని కూడా వార్త‌లు వినిపించాయి.

ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో మళ్లీ 'ఖడ్గం' లాంటి సినిమాని ఆశిస్తున్నామ‌ని నెటిజ‌న్ కోరితే కృష్ణ‌వంశీ ఆనాటి ప‌రిస్థితుల్ని గుర్తు చేసుకుని ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అయితే చంపేస్తారేమో అని స‌మాధానం చెప్ప‌డం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న 'రంగ‌మార్తాండ‌' మూవీ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ అందించారు.