Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' షూట్ పై డైరెక్టర్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   23 March 2021 12:39 PM GMT
ఆదిపురుష్‌ షూట్ పై డైరెక్టర్ కామెంట్స్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ - బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ కాంబినేషన్ లో ''ఆదిపురుష్‌'' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారం వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటుగా కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారని సమాచారం.

ఇకపోతే ఇటీవల ఓ డైలీతో మాట్లాడిన ఓం రౌత్ షూటింగ్ ఎలా జరుగుతున్నదీ వెల్లడించారు. 'ఆదిపురుష్‌' షూటింగ్ అంతా పాజిటివిటీతో జరుగుతోందని.. అందరూ ఎనర్జిటిక్ గా ఇందులో పాల్గొంటున్నారని ఓం రౌత్ చెప్పుకొచ్చారు. 3డీ టెక్నాలజీలో రూపొందనున్న ఈ సినిమా సెట్స్ లో ఉన్న పాజిటివిటీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం సెట్స్ లో గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ లా రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. 'ఆదిపురుష్‌' వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.