Begin typing your search above and press return to search.

మహేష్‌ లేదా బన్నీతో చేయాలని ప్లాన్

By:  Tupaki Desk   |   3 April 2018 5:53 PM GMT
మహేష్‌ లేదా బన్నీతో చేయాలని ప్లాన్
X
తమిళంలో హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అట్లీ తెలుగులో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. యంగ్ ఏజ్ లోనే దర్శకత్వం మొదలుపెట్టిన మొదటి సినిమా రాజా-రాణి తోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆర్య - నయనతార జంటగా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులనూ బాగా ఆకట్టుకుంది. తరవాత రెండు సినిమాలు తమిళ స్టార్ హీరో విజయ్ తో తెరకెక్కించాడు. వాళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి - మెర్సల్ రెండూ పోలీస్ - అదిరింది పేరుతో తెలుగులోకి డబ్ అయ్యాయి.

అట్లీ డైరెక్ట్ చేసిన మూడు చిత్రాలూ తెలుగులోకి డబ్ అవడంతో అతడి పేరు ఇక్కడి ప్రేక్షకులకు బాగానే నోటయింది. అట్లీ చివరి సినిమా మెర్సల్ తమిళంలో బ్లాక్ బస్టర్ అయి రికార్డులు తిరగరాసింది. దీంతో అతడితో పనిచేసేందుకు టాలీవుడ్ హీరోల్లో చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. అల్లు అర్జున్ - మహేష్ బాబుల్లో ఒకరితో సినిమా చేయాలని అట్లీ ప్లాన్ చేసుకుంటున్నాడట. వీళ్లిద్దరిలో ఎవరికి అట్లీ చెప్పిన కథ నచ్చితే వాళ్లతో సినిమా మొదలెట్టే అవకాశం ఉంది.

మహేష్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జునేమో వక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ కూడా తరవాత సినిమా ఎవరితో అన్నది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మరి అట్లీ ఛాయిస్ ఏమిటన్నది వెయిట్ చేసి చూడాలి.