Begin typing your search above and press return to search.

'జాతిరత్నాలు' కు మరో అతిపెద్ద కాంప్లిమెంట్‌

By:  Tupaki Desk   |   17 April 2021 4:30 AM GMT
జాతిరత్నాలు కు మరో అతిపెద్ద కాంప్లిమెంట్‌
X
నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్‌ నిర్మించిన 'జాతి రత్నాలు' సినిమా మంచి సక్సెస్‌ ను దక్కించుకుంది. కమర్షియల్‌ గా ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల జాబితాలో చేరుతుంది అనడంలో సందేహం లేదు. జాతి రత్నాలు సినిమా కు ఎంతో మంది ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో చూడలేని వారు ఇటీవల అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవుతుండటంతో చూస్తూ ఉన్నారు. థియేటర్లలో విడుదల సమయంలో ఎలా అయితే రెస్పాన్స్‌ వచ్చిందో ఇప్పుడు అదే తరహాలో రెస్పాన్స్‌ వస్తోంది. జాతిరత్నాలు సినిమా కు ఇటీవల మంత్రి కేటీఆర్‌ ఫిదా అయినట్లుగా చెప్పిన విషయం తెల్సిందే.

జాతి రత్నాలు సినిమాకు మరో పెద్ద కాంప్లిమెంట్‌ దక్కింది. తమిళనాడుకు చెందిన స్టార్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఈ సినిమా పై స్పందించాడు. సినిమాను చూస్తూ నవ్వుతూనే ఉన్నట్లుగా చెప్పాడు. ప్రతి సన్నివేశంకు నవ్వుతూనే ఉన్నాను. డైలాగ్స్ మరియు డైరెక్షన్‌ ఇంకా నటీ నటుల నటన చాలా బాగుందన్నాడు. సినిమా పై తన ప్రేమను ట్విట్టర్ ద్వారా దినేశ్‌ కార్తిక్‌ తెలియజేశాడు. అద్బుతమైన సినిమా అంటూ క్రికెటర్‌ చేసిన ట్వీట్‌ తో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. జాతి రత్నాలు సినిమా అమెజాన్ లో అత్యధికంగా వ్యూస్‌ ను దక్కించుకుంటుందట.

అమెజాన్‌ ప్రేక్షకులు జాతి రత్నాలుపై కాస్త నెగటివ్‌ గా కామెంట్స్ చేసినా కూడా మొత్తానికి అయితే సినిమా కొందరి పాజిటివ్ టాక్‌ తో నడుస్తోంది. కేటీఆర్ మరియు దినేష్‌ కార్తీక్ వంటి వారి ప్రశంసలతో సినిమా ను ఖచ్చితంగా మరింత మంది చూస్తారనే నమ్మకంను అమెజాన్‌ వారు వ్యక్తం చేస్తున్నారు. సినిమా చాలా సింపుల్‌ గా సిల్లీగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. జాతి రత్నాలు తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా ఎంటర్ టైన్‌ మెంట్‌ ను అందించింది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడు ఇతర నటీనటులు అంతా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. తప్పకుండా ముందు ముందు వీరు స్టార్స్ గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.